News January 28, 2026
‘రాజకీయాల్లో నిజాయతీకి మూల్యం’.. పవార్ మృతిపై రాజ్ ఠాక్రే

అజిత్ పవార్ మృతిపై MNS చీఫ్ రాజ్ ఠాక్రే సంచలన కామెంట్లు చేశారు. రాజకీయాల్లో నిజాయతీకి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని, ఇది తనకు వ్యక్తిగతంగా తెలుసని చెప్పారు. ‘అజిత్ ముక్కుసూటిగా ఉంటారు. హామీలు ఇచ్చి మోసం చేయడం ఆయన శైలి కాదు. దీని వల్ల తను ఎంత మూల్యం చెల్లించుకున్నారో ఊహించుకోవచ్చు’ అని ట్వీట్ చేశారు. అటు <<18982388>>విమాన ప్రమాదంపై<<>> మమతాబెనర్జీ అనుమానం వ్యక్తం చేయడం తెలిసిందే.
Similar News
News February 18, 2026
మరోసారి భారత్ vs పాక్?

పాకిస్థాన్ సూపర్-8కు క్వాలిఫై కావడంతో T20WCలో మరోసారి భారత్తో తలపడే అవకాశం ఉంది. భారత్ గ్రూప్-1, పాక్ గ్రూప్-2లో ఉండటం వల్ల సూపర్-8లో అది సాధ్యం కాదు. కానీ సూపర్-8లో గ్రూప్-1లో భారత్ ఫస్ట్, గ్రూప్-2లో పాక్ సెకండ్ వస్తే సెమీస్లో తలపడొచ్చు. భారత్ సెకండ్, పాక్ ఫస్ట్ వచ్చినా సాధ్యమే. ఒకవేళ రెండు జట్లు వేర్వేరు సెమీస్లో నెగ్గితే కొలంబో వేదికగా IND vs PAK ఫైనల్ చూసే ఛాన్స్ ఉంటుంది.
News February 18, 2026
పిల్లలు వద్దు బొమ్మలే ముద్దు అంటున్న చైనా జెన్జీ

జననాల రేటు తగ్గిపోతున్న చైనాలో జెన్జీ మహిళలు పిల్లల కంటే బొమ్మలే మేలంటున్నారు. తమకు నచ్చిన బొమ్మను డిజైన్ చేయించుకుని దానినే తమ బిడ్డగా లాలించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని భావిస్తున్నారు. పిల్లలను 18ఏళ్ల వరకు పెంచేందుకు దాదాపు రెండున్నర లక్షల డాలర్లపైనే అవుతుందని.. అదే బొమ్మ అయితే 200-800 డాలర్లలో దొరికేస్తుందని అంటున్నారు. దీని వల్ల తమ కెరీర్కు కూడా ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు.
News February 18, 2026
ఈశాన్య మూలలో వాస్తు దోషం ఉంటే?

ఈశాన్యం లోపిస్తే అభివృద్ధి కుంటుపడుతుందని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. ‘జ్ఞాన సముపార్జనలో ఆటంకాలు ఏర్పడతాయి. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం దెబ్బతింటుంది. ఇలాంటి స్థలంలో ఉంటే సమాజానికి, బంధువులకు దూరంగా ఒంటరిగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. లభించాల్సిన అవకాశాలు చేజారిపోతాయి. ఈశాన్య విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేయకూడదు. నిపుణుల సలహాతో సరైన మార్పులు చేసుకోవాలి’ అని సూచిస్తున్నారు. <<-se>>#Vasthu<<>>


