News January 28, 2026

మధ్యాహ్న భోజనం నాణ్యతలో రాజీపడొద్దు: DEO

image

ప్రభుత్వ పాఠశాలల్లో రానున్న విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి కృషి చేయాలని DEO సలీం భాష ఉపాధ్యాయులకు సూచించారు. కేఎస్ఆర్ మున్సిపల్ స్కూల్, హిందూ, యాదవ హైస్కూల్, నల్లపాడు ZPస్కుల్స్‌ని బుధవారం DEO ఆకస్మికంగా పరిశీలించారు. విద్యార్థులకు ప్రతిరోజూ అందించే చిక్కీలు, కోడిగుడ్లపై గడువును పరిశీలన చేస్తూ ఉండాలని, నాణ్యత విషయంలో రాజీపడొద్దని చెప్పారు.

Similar News

News February 5, 2026

GNT: 42 బార్ల కోసం 122 దరఖాస్తులు.. మరికొద్దిసేపటల్లో లాటరీ!

image

గుంటూరు జిల్లాలో బార్ల అనుమతుల కోసం వచ్చిన దరఖాస్తులను గుంటూరు కలెక్టరేట్‌లో నేడు లాటరీ తీయనున్నారు. మొత్తం 42 బార్ల కోసం నోటిఫికేషన్ ఇవ్వగా 122 దరఖాస్తులు వచ్చాయి. జీఎంసీ పరిధిలో 26 బార్లకు 84 దరఖాస్తులు అందాయి. అదేవిధంగా మంగళగిరి, తాడేపల్లి పరిధిలో 6 బార్లకు 24, పొన్నూరులో ఒక బార్ కి 6 దరఖాస్తులు వచ్చాయి. తెనాలిలో 9 బార్ల కోసం 8 దరఖాస్తులు దాఖలయ్యాయి. ఎవరి భవితవ్యం ఎలా ఉంటుందో చూడాలి.

News February 5, 2026

గుంటూరులో చోరీ.. రూ.3లక్షల అపహరణ

image

గుంటూరు లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బారాఇమాం పంజా సెంటర్‌లో చోరీఘటనపై బుధవారం పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు వెల్లడించారు. బారాఇమాం పంజా సెంటర్‌కి చెందిన పగడాల రాజేశ్వరి ఇంట్లో చోరీ జరిగినట్లు ఫిర్యాదు చేసింది. ఇంట్లోని రూ.3 లక్షల నగదు అపహరణకు గురైందని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యప్తు చేపట్టారు.

News February 5, 2026

సౌరశక్తితో గుంటూరులో 772 గిరిజన గృహాలకు వెలుగు

image

విద్యుత్‌ లేని కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం పలు పథకాల ద్వారా సరఫరా అందిస్తుందని లోక్‌సభలో వెల్లడైంది. RDSS, PM-JANMAN పథకాల కింద రాష్ట్రంలో వేలాది ఇళ్లకు విద్యుత్‌ కనెక్షన్లు మంజూరు చేశారు. కాగా గుంటూరు జిల్లాలో PM-JANMAN కింద 772 PVTG కుటుంబాలకు విద్యుత్‌ కనెక్షన్లు మంజూరయ్యాయి. సౌర వీధి దీపాలు, ఆఫ్‌గ్రిడ్‌ సౌర వ్యవస్థల ఏర్పాటుతో గిరిజన ప్రాంతాలకు లబ్ధి చేకూరిందని కేంద్ర మంత్రి వెల్లడించారు.