News January 28, 2026
తొలిసారి విఫలం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్కు యత్నించి..

విమానాన్ని ల్యాండ్ చేసేందుకు రెండోసారి ప్రయత్నిస్తుండగా <<18982417>>ప్రమాదం జరిగిందని<<>> Flightradar అంచనా వేసింది. బారామతి ఎయిర్పోర్టులో ల్యాండ్ చేసేందుకు 8.36AMకు తొలుత చేసిన ప్రయత్నం విఫలమైందని చెప్పింది. చివరి సిగ్నల్ 8.43AMకి వచ్చిందని వివరించింది. ఇక్కడ ఒకే రన్ వే ఉందని, ఆటోమేటిక్ వెదర్ రిపోర్టింగ్ వ్యవస్థ లేదని తెలిపింది. అత్యవసర ల్యాండింగ్కు పైలట్ యత్నించారని, కానీ కంట్రోల్ చేయలేకపోయారని తెలుస్తోంది.
Similar News
News February 2, 2026
లోకేశ్ నన్ను హతమర్చాలని చూస్తున్నారు: జోగి

AP: రెడ్ బుక్ రాజ్యాంగంతో లోకేశ్ తనను మట్టుబెట్టాలని చూస్తున్నారని మాజీ మంత్రి జోగి రమేశ్ ఆరోపించారు. తనకు ఏదైనా జరిగితే ఆయనదే బాధ్యత అన్నారు. లోకేశ్ ఆదేశంతో MP చిన్ని రౌడీలతో నా ఇంటిపై దాడి చేయించారు. దాడికి ముందు TDP నేతలతో DCP, CI చర్చించారు. TDP గూండాలు ర్యాలీగా పెట్రోలు సీసాలు, కర్రలతో వస్తుంటే వారికి పోలీసులు ఎస్కార్ట్గా వచ్చారు. ఇలాగే కొనసాగితే ప్రజలు తిరగబడక మానరు’ అని హెచ్చరించారు.
News February 2, 2026
HYD TO BLR.. 2 గంటల్లో వెళ్లిపోవచ్చు: అశ్వినీ వైష్ణవ్

దేశంలో హైస్పీడ్ రైళ్లు గంటకు 350KM వేగంతో ప్రయాణిస్తాయని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. దీంతో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు 2 గంటల్లో, పుణేకు 1.45 గంటల్లో, చెన్నైకి 2.55 గంటల్లో చేరుకోవచ్చన్నారు. హైస్పీడ్ కారిడార్తో AP-TG-TN మధ్య ఎకానమీ, హెల్త్, టూరిజం అభివృద్ధి చెందుతాయని చెప్పారు. హైస్పీడ్ రైళ్లు తెలుగు రాష్ట్రాలకు గేమ్ ఛేంజర్గా మారతాయని పేర్కొన్నారు.
News February 2, 2026
సహజ సేద్యంతో ఎక్కువ లాభం.. ఎందుకంటే?

వ్యవసాయంలో సహజ సేద్య పద్ధతుల వైపు నేడు చాలా మంది రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి కారణం ఈ విధానంలో పెట్టుబడి ఖర్చు తగ్గడమే. సహజ సేద్యంలో లాభాలు తొలుత ఆలస్యమైనా, కొంత కాలానికి సంప్రదాయ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్న రైతులతో సమానంగా ఆదాయం వస్తుంది. క్రిమిసంహారక మందులు, ఎరువులపై వెచ్చించే వ్యయం తగ్గడంతో పాటు పర్యావరణానికి, మన ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. మహిళలు ఎక్కువగా ఈ విధానం అనుసరిస్తున్నారు.


