News April 28, 2024
ALERT: అనంతపురం@ 43.7

భానుడి ప్రతాపానికి శనివారం రాయలసీమ ప్రజలు అల్లాడిపోయారు. దేశంలోనే నంద్యాలలో 44.9 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాగా.. కర్నూలులో 44.5 అనంతపురం 43.7, కడప 43.4, తిరుపతి 42.9, నెల్లూరులో 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దేశంలోనే హాటెస్ట్ సిటీగా నంద్యాల నిలవడం గమనార్హం. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, అవసరమైతే తప్ప మధ్యాహ్నం సమయంలో బయటకు రావద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Similar News
News January 31, 2026
పింఛన్ తీసుకున్న అరగంటకే వ్యక్తి మృతి

గుత్తిలోని బీసీ కాలనీలో విషాదం నెలకొంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి శనివారం ఉదయం పింఛన్ తీసుకున్న అరగంటకే ప్రాణాలు విడిచారు. మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మీయ చేతుల మీదుగా ఆయన పింఛన్ నగదు అందుకున్నారు. ఒకరోజు ముందుగానే పింఛన్ అందిన ఆనందంలో ఉన్న ఆ కుటుంబంలో, ప్రతాప్ రెడ్డి హఠాన్మరణం తీవ్ర విషాదాన్ని నింపింది.
News January 31, 2026
అనంత: ‘పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులివ్వాలి’

అనంతపురం జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఆయా శాఖల అధికారులు సత్వరమే అనుమతులు ఇవ్వాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ విష్ణుచరణ్ అధికారులకు సూచించారు. అనంతపురంలోని కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం ఆయా శాఖల అధికారులతో పరిశ్రమల ఏర్పాటు, ప్రోత్సాహకాలపై సమావేశం నిర్వహించారు. పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తే వారు పరిశ్రమలు ఏర్పాటుచేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారన్నారు.
News January 30, 2026
అనంత: ‘పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులివ్వాలి’

అనంతపురం జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఆయా శాఖల అధికారులు సత్వరమే అనుమతులు ఇవ్వాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ విష్ణుచరణ్ అధికారులకు సూచించారు. అనంతపురంలోని కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం ఆయా శాఖల అధికారులతో పరిశ్రమల ఏర్పాటు, ప్రోత్సాహకాలపై సమావేశం నిర్వహించారు. పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తే వారు పరిశ్రమలు ఏర్పాటుచేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారన్నారు.


