News January 29, 2026
సంగారెడ్డి: ‘క్యాన్సర్ పై అవగాహన కల్పించడమే లక్ష్యం’

గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు వచ్చే రొమ్ము క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ను తొలి దశలోనే గుర్తించి ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసిందని సెర్ఫ్ సీఈఓ దివ్య దేవరాజన్ అన్నారు. సంగారెడ్డిలోని ఎస్ఎస్ గార్డెన్లో అవగాహన సమావేశం బుధవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. క్యాన్సర్పై ఉన్న భయాలు, అపోహలను తొలగించి మహిళల్లో ధైర్యం నింపడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
Similar News
News February 19, 2026
NGKL: రాష్ట్రస్థాయి పోటీలలో సత్తా చాటిన దివ్యాంగ విద్యార్థులు

హైదరాబాదులో నిర్వహించిన రాష్ట్రస్థాయి దివ్యాంగుల విద్యార్థుల క్రీడలలో నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. క్రీడలలో పాల్గొని సత్తా చాటిన విద్యార్థులను జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ గురువారం సాయంత్రం అభినందించారు. జిల్లాకు చెందిన తులసీదర్, నాని, శ్రీ వర్ధన్, విద్యార్థులు క్రీడలలో సత్తా చాటి జిల్లాకు పేరు తేవడం గర్వకారణమని అన్నారు.
News February 19, 2026
అంగన్వాడీల్లో మౌలిక వసతులు కల్పించాలి: సంగారెడ్డి కలెక్టర్

జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో ఇంజినీరింగ్ శాఖల అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. అంగన్వాడీల్లో సివిల్ వర్క్లకు సంబంధించిన పనులు వేగవంతం చేయాలని సూచించారు.
News February 19, 2026
KNR: మెడికల్, హెల్త్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ

తెలంగాణ మెడికల్, హెల్త్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ వార్షిక డైరీ, వాల్ క్యాలెండర్ ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా మెడికల్ అండ్ హెల్త్ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజు నాయక్, సెక్రటరీ రాజగోపాల్, అదనపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధ, పిఓడిటి డా.ఉమాశ్రీ తదితులున్నారు.


