News April 28, 2024
ALERT.. అగ్నిగుండంలా రాయలసీమ.. హాటెస్ట్ సిటీగా నంద్యాల
భానుడి ప్రతాపానికి శనివారం రాయలసీమ ప్రజలు అల్లాడిపోయారు. దేశంలోనే నంద్యాలలో 44.9 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాగా.. కర్నూలులో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దేశంలోనే హాటెస్ట్ సిటీగా నంద్యాల నిలవడం గమనార్హం. అనంతపురం 43.7, కడప 43.4, తిరుపతి 42.9, నెల్లూరులో 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, అవసరమైతే తప్ప మధ్యాహ్నం బయటకు రావద్దని నిపుణులు సూచిస్తున్నారు.
Similar News
News October 14, 2024
నంద్యాలలో నూతన బస్సులు ప్రారంభించిన ఎంపీ
ఆర్టీసీ బస్సు ప్రయాణం సురక్షితమని, ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని మంత్రి ఫరూక్ అన్నారు. సోమవారం ఆయన నంద్యాల ఆర్టీసీ బస్టాండ్లో నూతన బస్సులను ఆర్టీసీ అధికారులతో కలిసి ప్రారంభించారు. నంద్యాలకు నూతనంగా ఏర్పాటు చేసిన బస్సులను ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News October 14, 2024
నంద్యాల: మద్యం దరఖాస్తుల ద్వారా రూ.40.42 కోట్లు ఆదాయం
నంద్యాల జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపు పారదర్శకంగా, ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ రాజకుమారి అన్నారు. కలెక్టరేట్లోని సెంటినరీ హాలులో ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మద్యం దుకాణాల కేటాయింపు పూర్తయింది. దరఖాస్తుల ద్వారా రూ.40.42కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆమె వెల్లడించారు.
News October 14, 2024
జ్వరంతో కొడుకు మృతి.. విషాదంలో తల్లి
ఆస్పరికి చెందిన శివ(16) జ్వరంతో మృతిచెందాడు. తల్లి మహేశ్వరి హోటల్ నడుపుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. శివకు జ్వరం రావడంతో శనివారం ఆదోనిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. పరిస్థితి విషమించడంతో కర్నూలు ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. భర్త భీమేష్ 2018లో అనారోగ్యంతో మృతి చెందాడు. కుటుంబానికి ఆధారమైన భర్త, కొడుకు మృతి చెందడం ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.