News January 29, 2026

చామంతి తోటలో నత్తల నివారణకు సూచనలు

image

చామంతి తోటల్లో నత్తల దాడితో కొన్ని ప్రాంతాల్లో రైతులు నష్టపోతున్నారు. వీటి నివారణకు మెథియోకార్బ్ గుళికలు 2KGలకు, అంతే మోతాదులో వరి తవుడు కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి నత్తలు తిరిగే దారిలో మొక్కల చుట్టూ చల్లాలి. అజాడిరక్టిన్(3000 P.P.M) 10ML లేదా కుంకుడు పొడి 60 గ్రాములను లీటరు నీటికి కలిపి నత్తలు తిరిగే మార్గంలో పిచికారీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

Similar News

News February 10, 2026

కల్తీ నెయ్యి.. చంద్రబాబుకు పెద్ద జియ్యంగార్ల లేఖ

image

AP: తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై పెద్ద జియ్యంగార్ల మఠం ఆగ్రహం వ్యక్తం చేసింది. నెయ్యి కల్తీ అపచారమని, బాధ్యతారహితమైన చర్య అని సీఎం చంద్రబాబుకు రాసిన లేఖలో పేర్కొంది. భవిష్యత్తులో తిరుమలలో అపచారాలు జరగకుండా పటిష్ఠమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరింది. ఆలయాల పవిత్రతను, ధర్మాన్ని రక్షించే శక్తిని సీఎంకు ఇవ్వాలని ఆకాంక్షించింది. కాగా ఈ కేసులో ఇప్పటికే <<19088531>>ఈడీ<<>> ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

News February 10, 2026

EMIల కోసం నటించను: పంకజ్ త్రిపాఠి

image

‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్‌తో పాపులర్ అయిన నటుడు పంకజ్ త్రిపాఠి ఆలస్యంగా సినిమాలు చేయడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొన్నేళ్ల పాటు తీరిక లేకుండా నటించడంతో బ్రేక్ తీసుకోవాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. EMI కట్టేందుకో, మనుగడ సాగించేందుకో నటించలేనన్నారు. తనలోని నటుడిని సంతృప్తి పరిచే రోల్స్‌ను సెలక్ట్ చేసుకుంటానని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. పాత్రల ఎంపికపై మరింత ఫోకస్ చేసినట్లు పేర్కొన్నారు.

News February 10, 2026

ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడనివ్వం: చంద్రబాబు

image

AP: ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడనివ్వమని CM చంద్రబాబు స్పష్టం చేశారు. విద్యుత్ కొనుగోలు భారాన్ని కూడా తగ్గించుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అగ్నిమాపక, పురపాలక, అటవీ, స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో నిబంధనలు సరళతరం చేయాలన్నారు. కేంద్రం నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని మంత్రులు, కార్యదర్శులతో సమావేశంలో పేర్కొన్నారు. పన్ను వసూళ్లు తగ్గకూడదని, వ్యాపారులను వేధించకూడదని చెప్పారు.