News April 28, 2024
మా పాలనలో ప్రజల జీవితాలు బాగుపడ్డాయి: సీఎం జగన్

AP: వైసీపీ పాలనలో పౌర సేవలన్నీ ఇంటికే వస్తున్నాయని CM జగన్ అన్నారు. ‘ పెన్షన్లు, రేషన్, వైద్య సేవలు ఇంటికే అందేలా వ్యవస్థను ఏర్పాటు చేశాం. మరో 15ఏళ్లు ఇలాంటి పాలన ఉంటే ప్రజల జీవితాలు ఇంకెంత బాగుపడతాయో ఆలోచించండి. ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చని చంద్రబాబు లాంటి మోసకారిని నమ్మొచ్చా? సైకిల్ను ఇంటి బయటే ఉంచాలి.. గ్లాసుని సింక్లో పడెయ్యాలి. వైసీపీకి ఒక్క సీటు తగ్గకుండా గెలిపించాలి’ అని కోరారు.
Similar News
News October 25, 2025
ప్రముఖ నటుడు కన్నుమూత

బాలీవుడ్ నటుడు సతీశ్ షా(74) మరణించారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ముంబైలో తుదిశ్వాస విడిచారు. కామెడీ పాత్రలతో పాపులరైన సతీశ్.. ఫనా, ఓం శాంతి ఓం, సారాభాయ్ Vs సారాభాయ్, మై హూ నా, జానే బి దో యారో మొదలైన చిత్రాల్లో నటించారు. ఇటీవలే స్టార్ కమెడియన్ గోవర్ధన్ అస్రానీ కూడా కన్నుమూసిన విషయం తెలిసిందే. వరుస మరణాలతో బాలీవుడ్లో విషాదం నెలకొంది.
News October 25, 2025
C-DACలో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు

<
News October 25, 2025
ముడతలను ఇలా తగ్గించుకోండి

వయసు పెరిగే కొద్దీ చర్మం పొడిబారి ముడతలు వస్తాయి. కానీ ప్రస్తుతం చాలామందికి చిన్నవయసులోనే ముఖంపై ముడతలు కనిపిస్తున్నాయి. వీటిని నివారించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. సన్స్ర్కీన్ లోషన్ రాసుకోవడం, హైడ్రేటెడ్గా ఉండటం, విటమిన్-సి, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న ఫుడ్స్ తీసుకోవడం, ఫేషియల్ ఎక్సర్సైజులు చేయడం వల్ల ఈ సమస్యను తగ్గించొచ్చని చెబుతున్నారు.


