News April 28, 2024
మా పాలనలో ప్రజల జీవితాలు బాగుపడ్డాయి: సీఎం జగన్

AP: వైసీపీ పాలనలో పౌర సేవలన్నీ ఇంటికే వస్తున్నాయని CM జగన్ అన్నారు. ‘ పెన్షన్లు, రేషన్, వైద్య సేవలు ఇంటికే అందేలా వ్యవస్థను ఏర్పాటు చేశాం. మరో 15ఏళ్లు ఇలాంటి పాలన ఉంటే ప్రజల జీవితాలు ఇంకెంత బాగుపడతాయో ఆలోచించండి. ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చని చంద్రబాబు లాంటి మోసకారిని నమ్మొచ్చా? సైకిల్ను ఇంటి బయటే ఉంచాలి.. గ్లాసుని సింక్లో పడెయ్యాలి. వైసీపీకి ఒక్క సీటు తగ్గకుండా గెలిపించాలి’ అని కోరారు.
Similar News
News December 13, 2025
ప్రసార భారతిలో కాస్ట్ ట్రైనీ పోస్టులు

<
News December 13, 2025
₹21000 CRతో యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణం: పొంగులేటి

TG: కుల, మతాలకు అతీతంగా విద్యార్థులందరికీ ఉత్తమ విద్య అందించేలా యంగ్ ఇండియా స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ‘CM విద్యకు ప్రాధాన్యమిస్తున్నారు. ₹21వేల కోట్లతో ఈ స్కూళ్ల భవనాలు నిర్మిస్తున్నాం. అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా ₹642 కోట్లతో స్కూళ్లలో సదుపాయాలు కల్పిస్తున్నాం’ అని వివరించారు. నైపుణ్యాల పెంపునకు ITIలలో ATCలను నెలకొల్పుతున్నట్లు వివరించారు.
News December 13, 2025
అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు: DGP

<<18552173>>కోల్కతా ఘటన<<>> నేపథ్యంతో HYD ఉప్పల్ స్టేడియం వద్ద అదనపు బలగాలను మోహరించినట్లు DGP శివధర్ రెడ్డి తెలిపారు. ‘కోల్కతా ఘటన తర్వాత మరోసారి ఏర్పాట్లపై సమీక్షించాం. అవాంఛనీయ ఘటనలు జరగకుండా, గ్రౌండ్లోకి ఫ్యాన్స్ రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. మెస్సీ 7.15PMకి స్టేడియానికి వస్తారు. మ్యాచ్ 20min జరుగుతుంది. చివరి 5minలో CM, మెస్సీ మ్యాచ్ ఉంటుంది’ అని తెలిపారు.


