News January 31, 2026
తిరుమల నెయ్యి.. క్లీన్ చిట్ వచ్చినట్లు YCP ప్రచారం: పయ్యావుల

AP: తిరుమలలో లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని 2022లో CFTRI రిపోర్ట్ ఇచ్చిందని, దాన్ని YCP తొక్కిపెట్టిందని మంత్రి పయ్యావుల ఆరోపించారు. ‘మేం వచ్చాకే కల్తీ వ్యవహారం బయటపడింది. నెయ్యిలో జంతు కొవ్వు అవశేషాలున్నాయని NDDB రిపోర్టులో తేలింది. అయినప్పటికీ సిట్ క్లీన్ చిట్ ఇచ్చినట్లు YCP ప్రచారం చేసుకుంటోంది. YCP హయాంలో TTD నిబంధనల మార్పుతోనే దుర్మార్గపు పనులకు పునాది పడింది’ అని మండిపడ్డారు.
Similar News
News February 20, 2026
Stocks: నష్టాల్లోంచి లాభాల్లోకి..

నిన్నటి నష్టాలను కొనసాగిస్తూ ఇవాళ కూడా రెడ్లో మొదలైన స్టాక్ మార్కెట్లు తేరుకున్నాయి. వాల్యూ బయింగ్లో భాగంగా ఇన్వెస్టర్లు మెటల్, బ్యాంక్ స్టాక్స్పై పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో సెన్సెక్స్ క్రమంగా లాభాల్లోకి వచ్చి ప్రస్తుతం 400 పాయింట్లు గ్రీన్లో కొనసాగుతోంది. అటు నిఫ్టీ కూడా 143 పాయింట్లు లాభాల్లో ఉంది.
News February 20, 2026
DRDOలో JRF పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

బెంగళూరు <
News February 20, 2026
కేవలం ఒకే చెంపదెబ్బ క్రూరత్వం కాదు: గుజరాత్ HC

తనకు చెప్పకుండా పుట్టింటికి వెళ్లి, రాత్రంతా అక్కడే ఉన్నందుకు భార్యను భర్త ఒక్కసారి చెంప దెబ్బ కొట్టడం IPC సెక్షన్ 498A కింద క్రూరత్వం కాదని గుజరాత్ HC వ్యాఖ్యానించింది. ఓ కేసులో 23 ఏళ్ల తర్వాత భర్తను నిర్దోషిగా ప్రకటిస్తూ కోర్టు ఈ తీర్పునిచ్చింది. భార్య ఆత్మహత్యకు భర్త వేధింపులే కారణమని నిరూపించడానికి బలమైన సాక్ష్యాలు ఉండాలని, కేవలం ఒక్క సంఘటనను క్రూరత్వంగా భావించలేమని కోర్టు స్పష్టం చేసింది.


