News January 31, 2026
మిర్యాలగూడ విద్యార్థినుల ప్రతిభ

నల్గొండ ఐటీ టవర్లో శనివారం నిర్వహించిన ఇంటర్వ్యూల్లో మిర్యాలగూడ విద్యార్థినులు ప్రతిభ చాటారు. హైదరాబాద్కు చెందిన ప్రముఖ సంస్థల్లో వివిధ ఉద్యోగాలకు 17 మంది విద్యార్థినులు ఎంపికయ్యారు. వారికి నిర్వాహకులు నియామక పత్రాలు అందజేశారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఈ సందర్భంగా నిర్వాహకులు కోరారు. ఉద్యోగాలు సాధించిన విద్యార్థినులను కళాశాల యాజమాన్యాలు, పలువురు ప్రముఖులు అభినందించారు.
Similar News
News February 15, 2026
NLG: అంగన్వాడీలపై ఇక పటిష్ఠ నిఘా

అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. వీటి పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేస్తోంది. ఆయా కేంద్రాల్లో కొనసాగుతున్న కార్యక్రమాలతో పాటు ప్రీస్కూల్, పోషకాహార పంపిణీ తదితర కార్యక్రమాలను ఈ కమిటీలు నిత్యం పర్యవేక్షించనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 2,093 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. రెండున్నరేళ్లుగా గ్రామాల్లో సర్పంచులు లేక గతంలో ఉన్న కమిటీలు అంతగా పనిచేయ లేదు.
News February 14, 2026
విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న ఛాయా సోమేశ్వరాలయం

చారిత్రక ప్రసిద్ధి గాంచిన నల్లగొండ పట్టణంలోని ఛాయా సోమేశ్వరస్వామి ఆలయం మహాశివరాత్రి పర్వదినానికి సర్వంగ సుందరంగా సిద్ధమైంది. రేపు జరగనున్న వేడుకల కోసం ఆలయ కమిటీ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక క్యూలైన్లు, చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు.విద్యుత్ దీపాలంకరణతో ఆలయ ప్రాంగణం దేదీప్యమానంగా వెలుగుతోంది. తెల్లవారుజాము నుంచే అభిషేకాలు, ప్రత్యేక పూజలు ప్రారంభం కానున్నాయి.
News February 14, 2026
నల్గొండ: గుండెపోటుతో పంచాయతీ కార్యదర్శి మృతి

చిట్యాల మండలం నేరడ పంచాయతీ కార్యదర్శి మేకల వెంకటేశ్వరరావు (61) ఇవాళ గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందాడు. హైదరాబాద్ ఇమ్లిబన్ బస్టాండ్లో ఈ ఘటన జరగ్గా పోలీసులు అధికారులకు సమాచారం ఇచ్చారు. గతంలో ఇదే మండలంలోని ఏపూరులో విధులు నిర్వహించారు. ఈ సెప్టెంబర్లో రిటైర్డ్ కావలసి ఉంది. ఆయన మృతి పట్ల మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, పీఎస్లు సానుభూతిని తెలిపారు.


