News April 28, 2024

శివంపేట: భార్య పుట్టింటికి వెళ్లడంతో భర్త సూసైడ్

image

మెదక్ జిల్లా శివంపేట మండలం గుండ్లపల్లికి చెందిన డప్పు కుమార్(30) ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం.. తరచూ మద్యం తాగి వస్తుండటంతో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో 4 రోజుల క్రితం గొడవపడి భార్య పుట్టింటికి వెళ్లగా.. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న కుమార్ శనివారం రాత్రి ఉరివేసుకున్నాడు. ఈ మేరకు శివంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Similar News

News September 12, 2025

శిథిల భవనాలకు ప్రతిపాదనలు అందజేయాలి: కలెక్టర్

image

జిల్లాలో వర్షం కారణంగా ప్రభావితమైన శిథిలావస్థలో ఉన్న అన్ని సంక్షేమ పాఠశాలలు, వసతి గృహాలు, కళాశాలల భవనాలకు సంబంధించి ప్రతిపాదన సిద్ధం చేసి అందజేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. మెదక్ కలెక్టరేట్ నుంచి డీఈవో, ఇంజినీరింగ్ అధికారులతో గూగుల్ మీట్ ఏర్పాటు చేసి దిశా నిర్దేశం చేశారు. జిల్లాలో 108 ఉన్నాయని వీటికి గడువులోగా నివేదికలు తయారు చేయాలన్నారు.

News September 11, 2025

మెదక్: కళాశాలను సందర్శించిన కలెక్టర్

image

మెదక్ పట్టణంలోని షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ బాలుర హాస్టల్, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాలను కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. రెండు రోజులపాటు ‌జిల్లాలో భారీ వర్షపాతం నమోదు అవుతుందని ‌వాతావరణ శాఖ హెచ్చరిక మేరకు మూడు రోజులపాటు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

News September 11, 2025

బీఆర్ఎస్వీ నాయ‌కుల‌ను వెంట‌నే విడుద‌ల చేయాలి: హ‌రీశ్‌రావు

image

గ్రూప్-1 పరీక్షను తిరిగి నిర్వహించాలని, జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలనే డిమాండ్‌తో చిక్క‌డ‌ప‌ల్లి సెంట్రల్ లైబ్రరీ, ఇతర ప్రాంతాల్లో ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్వీ నాయకులు, పార్టీ కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించిన నాయకులను, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.