News April 28, 2024

కమలాపురం-యర్రగుంట్ల హైవేపై రోడ్డు ప్రమాదం.. డ్రైవర్ మృతి

image

ఖాజీపేటకు చెందిన ఆటో డ్రైవర్ బాబాఫకృద్దీన్(40) రోడ్డు ప్రమాదంలో ఆదివారం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. బాబాఫకృద్దీన్ యర్రగుంట్ల నుంచి కమలాపురానికి ఆటోలో వస్తుండగా గ్రామచావిడి వద్ద ఆయనకు ఉన్నట్లుండి ఫిట్స్ వచ్చాయి. ఈ క్రమంలో ఆటోను పక్కకు ఆపే క్రమంలో రోడ్డు పక్కన గోడకు ఢీ కొట్టింది. ప్రమాదంలో డ్రైవరు అక్కడిక్కడే మృతి చెందాడు.  

Similar News

News October 15, 2024

తుఫాను నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కడప కలెక్టర్

image

రాష్ట్ర వ్యాప్తంగా తుఫాను కారణంగా విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలోని రెవెన్యూ డివిజన్ల వారీగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ శివశంకర్ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో విస్తృతంగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

News October 14, 2024

వైవీయూ ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్‌ రాజీనామా ఆమోదం

image

యోగివేమన విశ్వవిద్యాలయం తెలుగుశాఖ ఆచార్యులు తప్పెట రామ ప్రసాద్ రెడ్డి ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్‌గా బాధ్యతల నుంచి తప్పుకున్నారు. వ్యక్తిగత కారణాల దృష్ట్యా విధుల నుంచి రిలీవ్ చేయాలని ఉపకులపతిని కొద్దిరోజుల కిందట కలిసి కోరారు. ఆయన విజ్ఞాపన మేరకు విధుల నుంచి రిలీవ్ చేసినట్టు వైవీయూ ఉపకులపతి ఆచార్య కె. కృష్ణారెడ్డి వెల్లడించారు.

News October 14, 2024

కడప: డిగ్రీ ఒకేషనల్ పరీక్షలు వాయిదా

image

యోగి వేమన విశ్వవిద్యాలయ పరిధిలో ఈనెల 15వ తేదీ నుంచి జరగాల్సిన డిగ్రీ ఒకేషనల్ కోర్సులకు సంబంధించిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎన్. ఈశ్వరరెడ్డి తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను ప్రభావం అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాలపై ఉంటుందని ప్రకటించిన నేపథ్యంలో విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కె. కృష్ణారెడ్డి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.