News April 28, 2024

మే 1-5 వరకు ఖాతాల్లో పెన్షన్ జమ: కలెక్టర్ హిమాన్షు

image

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మే 1 నుంచి 5వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ చేపడతామని అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదివారం వెల్లడించారు. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలో పెన్షన్ సొమ్ము జమ చేస్తామన్నారు. దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, మంచానికి పరిమితమైన వారు, సైనిక, సంక్షేమ పింఛన్లు పొందే వారికి ఇంటి వద్దనే సెక్రటేరియట్ సిబ్బంది పెన్షన్లు అందజేస్తారన్నారు.

Similar News

News January 2, 2026

వంతెనపై బైక్.. గోదావరిలో శవమై తేలిన వేములూరు వాసి!

image

ఐదు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠ విషాదాంతమైంది. కొవ్వూరు మండలం వేములూరుకు చెందిన గేల్లా గోవిందప్రసాద్(38) మృతదేహం గోదావరి నదిలో లభ్యమైంది. డిసెంబరు 30న ఇంటి నుంచి వెళ్లిన ఆయన.. తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 31న రోడ్డు కం రైలు వంతెనపై బైకును గుర్తించిన పోలీసులు గాలింపు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News January 2, 2026

తూర్పు గోదావరిలో వరి సేకరణ వేగవంతం: జేసీ

image

తూర్పు గోదావరి జిల్లాలో ఖరీఫ్ వరి సేకరణ ప్రక్రియ విజయవంతంగా సాగుతోందని జేసీ వై. మేఘా స్వరూప్ గురువారం తెలిపారు. జనవరి 1, 2026 నాటికి పీపీసీల ద్వారా 3.67 లక్షల మెట్రిక్ టన్నుల వరిని సేకరించినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు 47,426 మంది రైతులు ధాన్యం విక్రయించారు. ఈ సీజన్‌లో 4 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని జేసీ అన్నారు.

News January 2, 2026

తూర్పు గోదావరిలో వరి సేకరణ వేగవంతం: జేసీ

image

తూర్పు గోదావరి జిల్లాలో ఖరీఫ్ వరి సేకరణ ప్రక్రియ విజయవంతంగా సాగుతోందని జేసీ వై. మేఘా స్వరూప్ గురువారం తెలిపారు. జనవరి 1, 2026 నాటికి పీపీసీల ద్వారా 3.67 లక్షల మెట్రిక్ టన్నుల వరిని సేకరించినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు 47,426 మంది రైతులు ధాన్యం విక్రయించారు. ఈ సీజన్‌లో 4 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని జేసీ అన్నారు.