News February 1, 2026
రణస్థలం: ‘లేబర్ కోడ్లను రద్దు చేయాలి’

లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని కోరుతూ ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సి.హెచ్.అమ్మన్నాయుడు పిలుపునిచ్చారు. రణస్థలంలో ఆదివారం ఫిబ్రవరి 12 సమ్మె కరపత్రాలు ఆవిష్కరించి మాట్లాడారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దంగా బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు మేలు చేసేందుకు లేబర్ కోడ్లను తెచ్చారని అన్నారు.
Similar News
News February 4, 2026
SKLM: నేడు జిల్లా పోలీస్ స్పోర్ట్స్ మీట్

శ్రీకాకుళం పోలీస్ అధికారులకు సంబంధించి వార్షిక జిల్లాస్థాయి స్పోర్ట్స్ గేమ్స్ కార్యక్రమం ఈనెల 4న శ్రీకాకుళం మండలం తండేవలస పోలీస్ శిక్షణ కేంద్రం గ్రౌండ్లో నిర్వహించనున్నట్లు ఎస్పీ కేవీ.మహేశ్వర్ రెడ్డి మంగళవారం తెలిపారు. పోలీస్ సిబ్బంది శారీరక దృఢత్వాన్ని క్రీడా స్ఫూర్తిని ప్రోత్సహించేందుకు ఈ క్రీడలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ముఖ్యఅతిథిగా రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి పాల్గొంటారన్నారు.
News February 3, 2026
శ్రీముఖలింగం: శివరాత్రి ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష

జలుమూరు మండలం శ్రీముఖలింగేశ్వరుని క్షేత్రంలో శివరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా జిల్లా అధికారులతో నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సమీక్షించారు. మంగళవారం మధ్యాహ్నం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయానికి వెళ్లిన ఆయన కలెక్టర్ స్వప్నిల్ దినకర్తో పాటు దేవాదాయ శాఖ అధికారులతో ఏర్పాట్లపై చర్చించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.
News February 3, 2026
ఆక్వా రంగంపై అమెరికా నిర్ణయం స్వాగతిస్తున్నాం: అచ్చెన్నాయుడు

అమెరికా ప్రభుత్వం భారతీయ సముద్ర ఆహార ఎగుమతులపై విధించిన టారిఫ్ను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడాన్ని స్వాగతిస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు మంగళవారం తెలిపారు. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం కింద ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల రాష్ట్రంలోని సముద్ర ఆహార ఎగుమతిదారులకు, ముఖ్యంగా ఆక్వా రంగానికి గణనీయమైన ఉపశమనం లభిస్తుందన్నారు. దీనివలన నిలిచిపోయిన కొత్త ఆర్డర్లకు మంచి అవకాశం ఉంటుందన్నారు.


