News February 1, 2026

అనంతపురం: హెల్మెట్ ధరిస్తే వెండి నాణెం బహుమతి

image

అనంతపురం నగరంలోని ఎంజీ పెట్రోల్ బంక్ వద్ద హెల్మెట్ ధరించిన వాహనదారులను పోలీసులు వినూత్నంగా సత్కరించారు. రోడ్డు భద్రత కోసం ‘నో హెల్మెట్ – నో పెట్రోల్’ నిబంధన నేటి నుంచి అమలులోకి రాగా ఈ కార్యక్రమం చేపట్టారు. 3 టౌన్ సీఐ రాజేంద్రనాథ్ యాదవ్, 4 టౌన్ సీఐ జగదీశ్ వాహనదారులకు వెండి నాణేలు, రోజా పూలు అందజేసి శాలువాలతో సత్కరించారు. ప్రాణ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని కోరారు.

Similar News

News February 18, 2026

అనంత: హోలీ పండుగ సందర్భంగా ప్రత్యేక రైళ్లు

image

హోలీ పండుగ సందర్భంగా రైల్వే శాఖ తిరుపతి-రాక్సౌల్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ఈనెల 21, 28న, మార్చి 7న తిరుపతి నుంచి ఉదయం 8.15 గంటలకు రైలు(07051) బయలుదేరి రెండో రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు రాక్సౌల్ చేరుకుంటుంది. తిరిగి ఈనెల 24న, మార్చి 3, 10న ఉదయం 8.30 గంటలకు రాక్సౌల్ నుంచి బయలుదేరి రెండో రోజు సాయంత్రం 6.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. ఈ రైళ్లు తాడిపత్రి, గుంతకల్లు మీదుగా నడుస్తాయి.

News February 17, 2026

ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసిన కలెక్టర్

image

బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడులోని అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలలో కలెక్టర్ ఆనంద్ జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 19ఏళ్లలోపు పిల్లలు తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలు నమిలి మింగాలని సూచించారు. సంవత్సరంలో రెండు సార్లు ఈ మాత్రలు వేసుకోవడం వల్ల నులిపురుగులు నశిస్తాయని తెలిపారు. పలువురు విద్యార్థులు ఇక్కడికి చేరుకొని మాత్రలు స్వీకరించారు.

News February 17, 2026

చెస్ పోటీలు ప్రారంభించిన కలెక్టర్, ఎంపీ

image

అనంతపురంలోని ఇండోర్ స్టేడియంలో మంగళవారం జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో శాప్ లీగ్–2026 చెస్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఎంపీ అంబికా లక్ష్మినారాయణ, కలెక్టర్ ఆనంద్ హాజరై వీటిని ప్రారంభించారు. యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకొని జాతీయ స్థాయిలో రాణించాలని వారు ఆకాంక్షించారు. జిల్లా నుంచి ప్రతిభావంతులు వెలుగులోకి రావాలన్నారు. పలు ప్రాంతాల నుంచి క్రీడాకారులు ఇక్కడికి చేరుకొని ఉత్సాహంగా పాల్గొన్నారు.