News February 1, 2026
రాజమండ్రి కార్పొరేషన్కు జాతీయ అవార్డు

రాజమండ్రి నగరపాలక సంస్థకు జాతీయస్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. అకౌంటింగ్ సంస్కరణల ప్రమోషన్లో భాగంగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రాజమండ్రికి ఈ అవార్డు దక్కింది. గ్రేటర్ నోయిడాలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో అదనపు కమిషనర్ పి.వి. రామలింగేశ్వర ఈ పురస్కారాన్ని అందుకున్నారు. సమిష్టి కృషితోనే ఈ ఘనత సాధ్యమైందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News February 4, 2026
కడియం నర్సరీ అందాలకు హాలీవుడ్ ప్రముఖుడి ఫిదా..!

కడియం నర్సరీల అందాలకు హాలీవుడ్ ప్రముఖుడు డాన్ చో ముగ్ధులయ్యారు. దక్షిణ కొరియా బృందంతో కలిసి శ్రీ సత్యదేవ నర్సరీని సందర్శించిన ఆయన, త్వరలో 450 ఎకరాల్లో ఇండో-కొరియన్ నర్సరీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మొక్కల ఎగుమతిపై నర్సరీ రైతులతో చర్చించారు. అంతర్జాతీయ స్థాయిలో కడియం మొక్కలకు గుర్తింపు రావడం పట్ల నర్సరీ యజమానులు సంతోషం వ్యక్తం చేశారు.
News February 4, 2026
రాజానగరంలో మెగా జాబ్ మేళా.. గోడపత్రికను ఆవిష్కరించిన కలెక్టర్

ఫిబ్రవరి 8న రాజానగరంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. బుధవారం దీనికి సంబంధించిన గోడపత్రికను ఆమె ఆవిష్కరించారు. ప్రముఖ కంపెనీలు పాల్గొనే ఈ మేళాలో టెక్నికల్, నాన్-టెక్నికల్ అభ్యర్థులు ఉపాధి పొందవచ్చని పేర్కొన్నారు. నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అర్హులైన వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
News February 4, 2026
పులిని పట్టుకోలేకపోవడం ప్రభుత్వ చేతగానితనమే: జక్కంపూడి రాజా

జిల్లాలో గత ఐదు రోజులుగా పులి సంచరిస్తున్నా, దానిని పట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జనవాసాల్లోకి పులి వచ్చి ప్రజలు భయాందోళనలకు గురవుతున్నా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గతంలో అధికారులు సమర్థవంతంగా పనిచేసి పులిని అటవీ ప్రాంతంలోకి పంపించారని, ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు.


