News February 1, 2026
మహిళా సాధికారతకు సరికొత్త బాట ‘షీ మార్ట్’

కేంద్ర బడ్జెట్ 2026లో మహిళలను వ్యాపార యజమానులుగా మార్చేందుకు ‘షీ మార్ట్’ పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. దీని ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలు సొంత రిటైల్ దుకాణాలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఏడాదికి రూ.1 లక్ష కంటే ఎక్కువ ఆదాయం పొందేలా మహిళలకు శిక్షణ, ఆర్థిక తోడ్పాటు అందించడమే ఈ పథకం లక్ష్యం. స్థానిక పొదుపు సంఘాల్లో చేరి, నైపుణ్య శిక్షణ పొంది, బ్యాంకు రుణాల ద్వారా తమ వ్యాపార కలను సాకారం చేసుకోవచ్చు.
Similar News
News February 22, 2026
తప్పిన వర్షం ముప్పు.. టాస్ గెలిచిన శ్రీలంక

T20WC: సూపర్-8 రెండో మ్యాచ్ పల్లెకెలెలో శ్రీలంక-ఇంగ్లండ్ మధ్య జరగనుంది. టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకుంది. నిన్నటి నుంచి అక్కడ వర్షం పడుతుండటంతో పాక్-న్యూజిలాండ్ మ్యాచ్ మాదిరే రద్దు అవుతుందని అంతా భావించారు. కాగా సూర్యుడి రాకతో వాతావరణ పరిస్థితులు మెరుగుపడి మ్యాచ్ నిర్వహణకు వీలు పడింది.
News February 22, 2026
సునీల్ కుమార్ సస్పెన్షన్ మరోసారి పొడిగింపు

AP: CID మాజీ చీఫ్ సునీల్ కుమార్ సస్పెన్షన్ను జూన్ 30 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. క్రిమినల్ కేసు పూర్తవడం లేదా రిటైర్మెంట్లో ఏది ముందైతే అప్పటి వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని పేర్కొంది. గత ప్రభుత్వ హయాంలో రఘురామకృష్ణరాజును వేధించారనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. అలాగే అగ్రిగోల్డ్ నిధుల దుర్వినియోగం, ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లారనే అభియోగాలున్నాయి.
News February 22, 2026
కనకాంబరం దిగుబడి పెరగాలంటే ఏం చేయాలి?

కనకాంబరం దిగుబడి పెరగాలంటే మొక్కలు పెరిగే తొలిదశలో కలుపు లేకుండా చూడాలి. వేసవిలో ఎండ తీవ్రతను తగ్గించడానికి అవిసె మొక్కలను పెంచితే పాక్షిక నీడ ఏర్పడి మొక్కలు బాగా పెరిగి అధిక పూల దిగుబడి వస్తుంది. పూలు కోయడం పూర్తైన తర్వాత పూల గుత్తులను, ఎండు కొమ్మలను తొలగిస్తే ఏడాది పొడవునా పువ్వులు పూసి దిగుబడి పెరుగుతుంది. కనకాంబరం పువ్వులను రోజు విడిచి రోజు ఉదయం లేదా సాయంత్రం వేళల్లో కోయాలి.


