News February 2, 2026
భద్రాద్రి జిల్లాలో 9 నామినేషన్ల ఉపసంహరణ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా ఆదివారం మూడు మున్సిపాలిటీల్లో మొత్తం 9 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు అధికారులు తెలిపారు. అశ్వారావుపేటలో ఆరుగురు కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకోగా.. కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో కాంగ్రెస్ నుంచి ఇద్దరు, సీపీఐ నుంచి ఒకరు నామినేషన్లు విత్డ్రా చేసుకున్నారు. ఇల్లందులో మాత్రం ఎలాంటి ఉపసంహరణలు జరగలేదని అధికారులు వెల్లడించారు.
Similar News
News February 8, 2026
MDK: రేపే ప్రచారానికి ఆఖరు

మున్సిపల్ ఎన్నికల పోరు కీలక ఘట్టానికి చేరింది. రేపు ప్రచారానికి ఆఖరు కావడంతో సమయం లేక అభ్యర్థులు ఆగమాగం అవుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిపి లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. పార్టీల ప్రచారం తీరు ఎలా ఉన్నా ఓటర్లు మాత్రం అందరి మాటలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 409 వార్డులకు1,486 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
News February 8, 2026
హాస్టళ్లకు సమస్యల గ్రహణం.. ఇప్పుడన్న వీడేనా.?

జిల్లాలో మొత్తం 113 వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి. పలు హాస్టల్స్లో సమస్యలు తిష్ట వేశాయి. వీటిని నెట్ జీరో ప్రాంగణాలుగా తీర్చిదిద్దేలా కలెక్టర్ ఇటీవల సమావేశం నిర్వహించారు. ప్రతి హాస్టల్లో ఆర్ఓ ప్లాంట్, టాయిలెట్స్, విద్యుత్, ఫ్యాన్, సోలార్ లైటింగ్, కిచెన్ గార్డెన్లు ఉండాలని సూచించారు. ఇందుకోసం నివేదికలు అందజేయాలని సూచించారు. ఇకనైనా సమస్యలు పరిష్కారం అవుతాయేమోనని తల్లిదండ్రులు భావిస్తున్నారు.
News February 8, 2026
చిత్తూరు: రైతన్నకు మారింత భారంగా..

రబీ సీజన్లో ఎరువుల ధరలు పెరుగుతుండడంతో రైతులు దిగులు చెందుతున్నారు. ఈ సీజన్లో ఇప్పటికే రెండుసార్లు ఎరువుల ధరను పెంచారు. గతంలో వివిధ రకాల ఎరువుల బస్తాలు రూ. 1550 నుంచి 1600 వరకు లభించేది. ప్రస్తుతం వాటి ధరలు రూ. 50 నుంచి 150 రూపాయల వరకు పెరిగాయి. పంటలకు అంతంత మాత్రంగా ఉన్న గిట్టుబాటు ధరలతో నష్టపోతున్న రైతులకు ఎరువుల ధర భారమవుతోంది.


