News February 2, 2026
కేంద్ర బడ్జెట్ చారిత్రాత్మకం: సోము వీర్రాజు

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ చారిత్రాత్మకమైనదని MLC సోము వీర్రాజు పేర్కొన్నారు. సోమవారం రాజమండ్రిలోని BJP కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఈ బడ్జెట్ ఏపీ ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా ఉందని, దేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ గత 12 ఏళ్లలో 350 సంస్కరణలు తీసుకువచ్చారని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.
Similar News
News February 20, 2026
జిల్లా రిజిస్ట్రార్గా జగన్మోహనరావు బాధ్యతల స్వీకారం

తూ.గో. జిల్లా నూతన రిజిస్ట్రార్గా కె.జగన్మోహనరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. 1993లో జూనియర్ అసిస్టెంట్గా ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన, సీనియర్ అసిస్టెంట్గా, గ్రేడ్-2, గ్రేడ్-1 సబ్ రిజిస్ట్రార్గా వివిధ హోదాల్లో పనిచేశారు. మచిలీపట్నం సబ్ రిజిస్ట్రార్గా సేవలందిస్తూ పదోన్నతిపై ఇక్కడకు విచ్చేశారు. ఈ సందర్భంగా పలువురు సబ్ రిజిస్ట్రార్లు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
News February 19, 2026
గొల్లగూడెం: ట్రాక్టరుపై నుంచి పడి బాలిక స్పాట్ డెడ్

దేవరపల్లి మండలంలోని గొల్లగూడెం వద్ద గురువారం జరిగిన ప్రమాదంలో 11 ఏళ్ల బాలిక మృతి చెందింది. నిడదవోలు మండలం సమీశ్రగూడెంకు చెందిన ఓ కుటుంబం పొగాకు పనుల నిమిత్తం దుమంతులగూడెం వలస వచ్చింది. పనికి వెళ్తుండగా ట్రాక్టరుపై నుంచి బాలిక ప్రమాదవశాత్తు జారి కిందపడటంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. దేవరపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News February 19, 2026
కొవ్వూరు మున్సిపాలిటీపై పసుపు జెండా

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మున్సిపల్ పీఠం TDP పరమైంది. YCP మున్సిపల్ ఛైర్పర్సన్ బావన రత్నకుమారితో పాటు నలుగురు కౌన్సిలర్లు పల్లా శ్రీనివాసరావు సమక్షంలో బుధవారం TDPలో చేరారు. దీంతో ఎమ్మెల్యేతో కలిపి కూటమి బలం 14కు చేరి స్పష్టమైన మెజారిటీ లభించింది. గత ఎన్నికల్లో YCP గెలిచినప్పటికీ, తాజా మార్పులతో కొవ్వూరు మున్సిపాలిటీని TDP కైవసం చేసుకుంది.


