News February 2, 2026
HYD TO BLR.. 2 గంటల్లో వెళ్లిపోవచ్చు: అశ్వినీ వైష్ణవ్

దేశంలో హైస్పీడ్ రైళ్లు గంటకు 350KM వేగంతో ప్రయాణిస్తాయని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. దీంతో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు 2 గంటల్లో, పుణేకు 1.45 గంటల్లో, చెన్నైకి 2.55 గంటల్లో చేరుకోవచ్చన్నారు. హైస్పీడ్ కారిడార్తో AP-TG-TN మధ్య ఎకానమీ, హెల్త్, టూరిజం అభివృద్ధి చెందుతాయని చెప్పారు. హైస్పీడ్ రైళ్లు తెలుగు రాష్ట్రాలకు గేమ్ ఛేంజర్గా మారతాయని పేర్కొన్నారు.
Similar News
News February 22, 2026
మాజీ భార్య, కుమారుడికి పాండ్య ఖరీదైన గిఫ్ట్!

మాజీ భార్య నటాషా, కుమారుడు అగస్త్యకు ఆల్రౌండర్ హార్దిక్ <<19182059>>పాండ్య<<>> కాస్ట్లీ ల్యాండ్రోవర్ డిఫెండర్ కారు గిఫ్ట్గా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీని విలువ రూ.4 కోట్లు. కొంతకాలం క్రితం నటాషాకు విడాకులు ఇచ్చిన పాండ్య.. ఆమెతో పాటు కొడుకు బాగోగులు చూసుకుంటున్నట్లు సమాచారం. ఈక్రమంలోనే వీరిద్దరికీ కారు కొనిచ్చారట. నటాషా, అగస్త్య కారు షోరూమ్లో దిగిన ఫొటోల్లో ‘పాపా టు అగస్త్య’ అని రాసి ఉన్న బోర్డు కనిపిస్తోంది.
News February 22, 2026
మొక్కజొన్నను ఆశించే తెగుళ్లు – నివారణ

మొక్కజొన్న నాటిన 30 రోజుల దశలో పేనుబంక ఆశిస్తుంది. దీని వల్ల ఆకులు పసుపు రంగులోకి మారి ముడుచుకుపోతాయి. దీని నివారణకు లీటరు నీటికి డైమిథోయేట్ 2ml, ఎసిఫేట్ 1.5 గ్రాములను కలిపి పిచికారీ చేయాలి. నల్లులు ఆశించకుండా పొలంలో కలుపు లేకుండా చూసుకోవాలి. ఒకవేళ నల్లులు ఆశిస్తే లీటరు నీటిలో డైకోఫాల్ 50mlను కలిపి పిచికారీ చేయాలి. తెల్లదోమ నివారణకు 1ml వేప నూనెను 5 గ్రాముల సబ్బుపొడిలో కలిపి పిచికారీ చేయాలి.
News February 22, 2026
హోం క్లీనింగ్ టిప్స్

* కత్తెర మొద్దుబారినప్పుడు అల్యూమినియం ఫాయిల్ ను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరిస్తే పదునెక్కుతుంది. * మొక్కజొన్న పిండికి కొంచెం నీళ్ళు కలిపి పేస్టు చేసుకొని అద్దాలకు పట్టించి పొడి వస్త్రంతో తుడవాలి. * కంప్యూటర్ కీ బోర్డు, మౌస్ పై మరకలు పడితే వెనిగర్లో ముంచిన వస్త్రంతో శుభ్రం చేయాలి. దీనివల్ల సూక్ష్మక్రిములూ నశిస్తాయి. * వెండి వస్తువులను సహజ సిద్ధ గోరింటాకులో నానబెట్టి శుభ్రపరిస్తే తళతళలాడతాయి.


