News February 3, 2026

బలహీన పోలింగ్ బూత్‌లపై TDP ప్రత్యేక దృష్టి

image

AP: అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి ఓట్లు బాగా తగ్గిన పోలింగ్ బూత్‌లపై TDP ప్రత్యేక దృష్టి సారించింది. ఇలాంటి బూత్‌లు 4500 ఉన్నట్లు గుర్తించి వాటిపై సర్వే చేయించింది. వివిధ పదవులు పొందిన 1000 మంది నాయకులతో ఈ సర్వే పూర్తి చేసింది. వీటిలో ఉన్న లోపాలపై నివేదికలను రప్పించింది. స్థానిక సంస్థల ఎన్నికలకు SEC కసరత్తు చేపట్టిన నేపథ్యంలో అంతకు ముందుగా ఈ బూత్‌లలో పార్టీని పటిష్ఠం చేసేలా శిక్షణకు నిర్ణయించింది.

Similar News

News February 23, 2026

వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

image

TG: రాష్ట్రంలో రేపు కూడా వర్షాలు కొనసాగే అవకాశముందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, NZB, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, SRPT, మహబూబాబాద్, WGL, హనుమకొండ, RR, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, SDPT, జనగాం, మేడ్చల్, యాదాద్రి జిల్లాల్లో రేపు 8.30am వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

News February 23, 2026

స్కూలు విద్యార్థులకు SM నిషేధిస్తూ చట్టం: అనిత

image

AP: పాఠశాల విద్యార్థులు సోషల్ మీడియా వినియోగించకుండా చట్టం తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్లు హోంమంత్రి అనిత తెలిపారు. SMలో తప్పుడు ప్రచారాల కట్టడికి మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. విద్వేషపూరిత, అసభ్య పోస్టుల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు అసెంబ్లీలో తెలిపారు. రాష్ట్రంలో SM పోస్టులపై 1,384 కేసులు నమోదు చేశామని, 1,067 మందిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచామని చెప్పారు.

News February 23, 2026

కర్ణాటక హైకోర్టుకు రణ్‌వీర్ సింగ్

image

తనపై నమోదైన క్రిమినల్ కేసు కొట్టివేయాలని కోరుతూ బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై అర్జెంట్ హియరింగ్ చేపట్టాలన్న విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. స్పెషల్ ట్రీట్మెంట్ ఎందుకని.. పిటిషనర్ బాలీవుడ్ స్టార్ కాబట్టి విచారణ వేగవంతం చేయాలా? అని జస్టిస్ నాగప్రసన్న ప్రశ్నించారు. దీనిపై రేపు విచారణ జరగనుంది. కాంతారలో దైవాన్ని కించపరిచారంటూ <<18988013>>రణ్‌వీర్‌పై<<>> కేసు నమోదైంది.