News February 3, 2026

BREAKING.. కాకాణికి నోటీసులు

image

మాజీ మంత్రి, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డికి పోలీసు అధికారులు నోటీసులు ఇచ్చారు. చంద్రబాబు, సోమిరెడ్డిపై కాకాణి గోవర్ధన్ రెడ్డి దుర్బషలాడారని టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీనిపై నెల్లూరు రూరల్, పొదలకూరు, మనుబోలులో కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన ఇంటికి వెళ్లి పోలీసులు నోటీసులు అందజేశారు.

Similar News

News February 7, 2026

నెల్లూరు: అయినోళ్లే ప్రాణాలు తీస్తున్నారు..!

image

నెల్లూరు జిల్లాలో చాలామందికి చట్టం అంటే భయం లేకుండా పోయింది. కావలిలో ఆస్తి కోసం సొంత వారే రైల్వే ఉద్యోగి <<19066737>>నాగరాజును <<>>హత్య చేశారని ఆరోపణలు ఉన్నాయి. నవాబుపేటలో మహిళ <<19072747>>హత్య<<>>, సైదాపురంలో అన్నదమ్ముల మధ్య రక్తపాతం జిల్లాను ఉలిక్కిపడేలా చేశాయి. పోలీసులు రాత్రి వేళ గస్తీ, డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టినా.. వరుస హత్యలు ఆగడం లేదు. నేరస్థులపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

News February 7, 2026

నెల్లూరు: ఆ ఊరిలో అలా చేస్తే రూ.10వేల ఫైన్

image

నెల్లూరు జిల్లా మనుబోలు మండలం యాచవరం గ్రామస్థుల నిర్ణయం వైరల్ అవుతోంది. గ్రామంలో అన్యమత ప్రచారం చేస్తే రూ.10వేల జరిమానా విధిస్తామని తీర్మానం చేశారు. ‘గ్రామంలో ఉండేది అంతా హిందువులే. గ్రామంలో అన్య మత ప్రచారం చట్ట విరుద్ధం. ఎవరైనా బయట వ్యక్తులు వచ్చి ప్రచారం చేస్తే ఊరుకునేది లేదు. ఎవరైనా మతం మీద అభిమానం ఉంటే బయటకు వెళ్లి చేసుకోండి’ అంటూ ఓ బోర్డు ఏర్పాటు చేశారు.

News February 7, 2026

నెల్లూరు జిల్లాలో విషాదం

image

కోవూరులో ఇటీవల అపహరణకు గురైన బాలిక చెన్నైలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. అంగడికి వెళ్తున్న బాలికను ఇద్దరు మైనర్లు బైకుపై ఎక్కించుకుని మామిడి తోటలోకి తీసుకెళ్లారు. గుర్తు తెలియని ద్రవం తాగించడంతో బాలిక కోమాలోకి వెళ్లింది. అక్కడి నుంచి ఆ ఇద్దరు యువకులు పారిపోయారు. బాలికను తల్లిదండ్రులు గుర్తించి ఆసుపత్రికి తీసుకెళ్లగా చనిపోయింది. మైనర్లను జువెనైల్ హోంకు తరలించారు.