News February 4, 2026
మొగిలిపేట ట్రాక్టర్ ప్రమాదం.. పెను విషాదం

మల్లాపూర్ మండలం మొగిలిపేటలో ట్రాక్టర్ బోల్తాపడి నలుగురు రైతు కూలీలు మరణించారు. ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడిన ప్రమాదంలో సంపంగి సాయమ్మ w/o ఎల్లయ్య(35), మంగళరపు లలిత w/o ధర్మరాజు (42), రోడ్డ వైష్ణవి D/O పోచయ్య(13), పెద్దిరెడ్డి గంగు w/o గంగాధర్ (45) అనే ముగ్గురు మహిళలు ఒక చిన్నారి మరణించడంతో గ్రామంలో పెను విషాదం నెలకొంది.
Similar News
News February 19, 2026
NZB: 58 పరీక్షా కేంద్రాల ఏర్పాటు: కలెక్టర్

ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు నిర్వహించబోయే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల కోసం NZB జిల్లా వ్యాప్తంగా 58 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ప్రథమ సంవత్సరం పరీక్షలకు 19,299 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 17,664 మంది మొత్తం 36,963 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరు కానున్నారన్నారు. ప్రతిరోజూ ఉ. 9 గంటల నుంచి మద్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.
News February 19, 2026
ఈ నెల 28న తెలంగాణ బడ్జెట్

TG: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 26న సమావేశాలు ప్రారంభం కానుండగా, 28వ తేదీన అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. 15 రోజుల పాటు సభను నిర్వహించాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
News February 19, 2026
ఏపీ రాజకీయాలు ఇందాపూర్ డెయిరీ చుట్టూనే..!

కల్తీ నెయ్యి కేసులో సిట్ మూడో ఛార్జిషీట్ దాఖలు చేయడంతో వివాదం సద్దుమణిగిందని అనుకున్నారు. కానీ అక్కడి నుంచి ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ప్రస్తుతం వైసీపీ లేవనెత్తిన ఇందాపూర్ డెయిరీ అంశంపై వాదోపవాదాలు సాగుతున్నాయి. అటు శాసనమండలిలో.. ఇటు టీటీడీ ఛైర్మన్ వర్సెస్ భూమనగా సాగుతుంది. ఇప్పటికే లడ్డూ వివాదంతో విసిగిపోయిన భక్తులు ఒక్కరిపై ఒక్కరు ఆరోపణలు చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


