News April 29, 2024

ఒక్కప్పుడు అవినీతి ఆరోపణలే సంచలనం.. కానీ ఇప్పుడు: మోదీ

image

అవినీతి ఈరోజుల్లో సర్వసాధారణంగా పరిగణించడం ఆందోళన కలిగిస్తోందన్నారు ప్రధాని మోదీ. ‘ఒకప్పుడు ఆరోపణలే దేశాన్ని కుదిపేసేవి. కానీ ఇప్పుడు నేరం రుజువై శిక్ష అనుభవించినా కొందరు చేతులు ఊపుతూ ఫొటోలకు పోజులు ఇస్తున్నారు. అది అవినీతిని గొప్పగా చెప్పుకుంటున్నట్లు కాదా? అవినీతిని సర్వసాధారణంగా పరిగణించొద్దు. అలా చేస్తే దేశానికి ఎంతో నష్టం. ఇది కేవలం బీజేపీ vs ప్రతిపక్షాలు కాదు’ అని పేర్కొన్నారు.

Similar News

News January 30, 2026

‘ఓం శాంతి శాంతి శాంతిః’ రివ్యూ& రేటింగ్

image

కన్నవాళ్లు విధించిన కట్టుబాట్లు, భర్త(తరుణ్ భాస్కర్) చూపించే పురాషాహంకారాన్ని ఎదిరించి ప్రశాంతి(ఈషా రెబ్బ) జీవితంలో ఎలా నిలదొక్కుకుంది అనేదే కథ. తరుణ్, ఈషా నటన మెప్పిస్తుంది. కొన్ని సీన్లు ఆలోచింపజేస్తాయి. సెకండాఫ్‌లో డైరెక్టర్ AR సజీవ్ తడబడినట్లు అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే, కామెడీ సీన్లు ఒరిజినల్ మలయాళ చిత్రం ‘జయ జయ జయ జయహే’ తరహాలో వర్కౌట్ కాలేదన్న భావన కలుగుతుంది.
రేటింగ్: 2.25/5

News January 30, 2026

కారు ఇంటి వద్ద ఉన్నా టోల్.. ఇదే కారణం!

image

దేశవ్యాప్తంగా FASTag వ్యవస్థలో లోపాలు గుర్తించినట్లు LSలో ఓ ప్రశ్నకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సమాధానం ఇచ్చారు. ‘2025లో 17.7లక్షల వాహనాలకు తప్పుగా టోల్ వసూలైంది. ఇంటి వద్ద ఉన్న కార్లకూ ఛార్జీ పడినట్లు మెసేజ్‌లు వెళ్లాయి. టోల్ ప్లాజాల్లో ఆటోమేటిక్ సిస్టమ్ పనిచేయనప్పుడు మాన్యువల్ ఎంట్రీ కారణంగా ఈ తప్పిదాలు జరిగాయి. 17.7లక్షల కేసులకు సంబంధించి NHAI టోల్ డబ్బులు తిరిగి చెల్లించింది’ అని వివరించారు.

News January 30, 2026

పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు?

image

US-ఇరాన్‌ వైరం చమురు మార్కెట్‌ను ప్రభావితం చేస్తోంది. లండన్ మార్కెట్‌లో బ్రెంట్ నార్త్ సీ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ 2.4% పెరిగి $70.06కు చేరింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ కూడా 2.6% పెరిగి బ్యారెల్ $64.82కి చేరింది. US దాడి చేస్తే ఇరాన్ ఆయిల్ ఉత్పత్తి రోజుకు 3M బ్యారెల్స్ తగ్గనుందని నిపుణుల అంచనా. హార్ముజ్ జలసంధి రవాణాపై ప్రభావం పడొచ్చు. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశముందని చెబుతున్నారు.