News February 4, 2026

సిరిసిల్ల: నిధులు తెచ్చే బాధ్యత నాది: బండి సంజయ్

image

సిరిసిల్ల మున్సిపాలిటీని బీజేపీకి అప్పగిస్తే పెద్ద ఎత్తున నిధులిస్తానని పీఎం మోదీ భరోసా ఇచ్చారు. ఆయన మాటగా చెబుతున్నా ఛైర్మన్ పీఠాన్ని మాకు అప్పగించండని కేంద్రమంత్రి బండి సంజయ్ కోరారు. సిరిసిల్లలో ఆయన మాట్లాడుతూ.. లేనిపక్షంలో కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లిస్తారని, పైసలు మావి, ప్రగతి మాది, సోకులు వాళ్లవని అన్నారు. కమిషన్లు వాళ్లవని, మళ్లీ అలాంటి వారికి ఎలా ఓట్లేస్తారని ఓటర్లను ప్రశ్నించారు.

Similar News

News February 12, 2026

హెవీ వెహికల్ ఫ్యాక్టరీలో 220 పోస్టులు

image

చెన్నై ఆవడిలోని హెవీ వెహికల్ ఫ్యాక్టరీలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 220 జూనియర్ టెక్నీషియన్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. టెన్త్, ఐటీఐ అర్హతతో పాటు పనిఅనుభవం వారు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్టింగ్, ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. బేసిక్ పే 21,000+IDA చెల్లిస్తారు. సైట్: avnl.co.in

News February 12, 2026

అరటిలో తొండం కుళ్లు తెగులు – నివారణ

image

సూర్యరశ్మి తాకిడికి అరటి గెల తొండంపై ఎండుమచ్చలు ఏర్పడి క్రమేపి అక్కడ కుళ్లు ఏర్పడుతుంది. గెలబరువు పెరిగినపుడు కుళ్లిన తొండం విరిగి గెలపడిపోతుంది. ఒక్కొక్కసారి గెలలో కాయలు సరిగా తయారుకావు. ఈ సమస్య నివారణకు తొండంపై అరటి ఆకులు చుట్టినట్లయితే వాటిపై ఎండు మచ్చలు ఏర్పడవు. మచ్చలు ఏర్పడిన తొండం పూర్తిగా తడిసేలా లీటరు నీటికి కార్బండిజమ్ 1గ్రా. కలిపి పిచికారీ చేయాలి.

News February 12, 2026

గుంటూరు–విజయవాడ రైల్వే రద్దీకి చెక్.. కొత్త లైన్లపై కేంద్రం క్లారిటీ

image

పార్లమెంట్‌లో రైల్వే అభివృద్ధిపై ఎంపీ కృష్ణదేవరాయులు అడిగిన ప్రశ్నలకు కేంద్రం సమాధానం ఇచ్చింది. శావల్యాపురం–బాపట్ల కొత్త లైన్‌పై ప్రస్తుతం గుంటూరు, తెనాలి మార్గంలో సౌకర్యం ఉందని మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. గుంటూరు–విజయవాడ రద్దీ తగ్గించేందుకు ఎర్రుపాలెం–అమరావతి–నంబూరు, కోటిపల్లి–నర్సాపురం, గుంటూరు–బీబీనగర్, గుంటూరు–గుంతకల్ డబ్లింగ్ పనులు కొనసాగుతున్నాయి. 4వ లైన్ డీపీఆర్‌కు సర్వేలు మంజూరయ్యాయి.