News February 5, 2026

మాదాపూర్ PSలో చంద్రహాస్‌పై కేసునమోదు

image

మాదాపూర్ PSలో బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్‌పై కేసు నమోదు చేశారు. ఓ ఆడియో ఫంక్షన్‌లో బూతు పాటలు పాడినట్టు ఫిర్యాదుల మేరకు ఓ టీవీ ఎడిటర్ అశోక్ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు చర్యలు తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని ఆడియో ఎవిడెన్స్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News February 15, 2026

హస్తం జోరు.. ఇక GHMC ఎన్నికలేనా?

image

మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ సత్తాచాటడంతో జోష్‌లో ఉంది. ఇదే ఊపులో GHMC ఎన్నికలు నిర్వహించేందుకు సర్కారు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 3 కార్పొరేషన్లుగా ఏర్పాటు కావటంతో పలు విషయాలను పరిగణనలోకి తీసుకుని రిజర్వేషన్లను ఖరారు చేసే పనిలో పడింది. మే నెల చివరి కల్లా పాలకమండలి కొలువుదీరేలాగా సర్కార్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. శివారు మున్సిపాలిటీల్లో హస్తానికి మిశ్రమ ఫలితాలొచ్చాయి.

News February 15, 2026

HYD: ఈ శివాలయానికి వెయ్యేళ్ల చరిత్ర..!

image

శివారులోని శంకర్‌పల్లి మం. చందిప్పలో 1000 ఏళ్ల క్రితం నాటి మహిమగల బ్రహ్మసూత్ర మరకత శివాలయం ఉంది. సోమేశ్వర లింగాన్ని దర్శిస్తే వ్యాధులు పోతాయని అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. ఆలయ ప్రాంగణంలో వెలసిన కాలభైరవుడు గుడిని వెయ్యి కళ్లతో రక్షిస్తాడని చెబుతారు. HYD నుంచి శంకర్‌పల్లి 40 కిలోమీటర్లు. మెహదీపట్నం, పటాన్‌చెరు నుంచి ఇక్కడికి బస్సు సౌకర్యం ఉంది. శంకర్‌పల్లి నుంచి ఆటోలు ఉంటాయి.

News February 15, 2026

HYD: కార్పొరేషన్‌లో ప్రతి సోమవారం ప్రజావాణి

image

నూతనంగా ఆవిర్భవించిన మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ప్రతీ సోమవారం ప్రజావాణి నిర్వహించనున్నట్లు కమిషనర్లు వినయ్ కృష్ణారెడ్డి, సృజన స్పష్టంచేశారు. సోమవారం ఉ.10:30 గం. నుంచి మ. ఒంటి గంట వరకు తార్నాకలోని MMC ఆఫీస్‌లో మల్కాజిగిరి, మాదాపూర్‌లోని న్యాక్ బిల్డింగ్ సీఎంసీ ఆఫీస్‌లో సైబరాబాద్ ప్రజావాణి ఉంటుంది. అన్ని సర్కిల్, జోనల్ ఆఫీస్‌లలో అధికారులు పాల్గొనాలని ఆదేశాలు జారీ చేశారు.