News February 5, 2026
కర్నూలులో పడిపోయిన ధరలు

కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో కందుల ధరలు పడిపోయాయి. క్వింటా గరిష్ఠంగా రూ.9,200 చేరిన కందుల ధర తాజాగా రూ.8 వేల లోపు పడిపోయింది. కనిష్ఠ ధర రూ.2,609, గరిష్ఠ ధర రూ.7,901కు అమ్ముడుపోయాయి. నిన్న మార్కెట్కు 3,655 క్వింటాళ్ల కందులు వచ్చాయి.
Similar News
News February 19, 2026
ఢిల్లీ AI సమ్మిట్లో బిల్ గేట్స్ స్పీచ్ రద్దు

ఢిల్లీలో జరుగుతున్న ‘ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్’లో బిల్ గేట్స్ ప్రసంగం రద్దయినట్లు గేట్స్ ఫౌండేషన్ ప్రకటించింది. వివాదాల దృష్ట్యా సదస్సు ప్రాధాన్యం దెబ్బతినొద్దనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆయన స్థానంలో ఫౌండేషన్ ప్రతినిధి అంకుర్ వోరా ప్రసంగించనున్నారు. ‘ఎప్స్టీన్ ఫైల్స్’లో బిల్ గేట్స్ పేరున్న నేపథ్యంలో ప్రభుత్వమే ఆయన నుంచి దూరం పాటిస్తోందనే వాదనలూ వినిపిస్తున్నాయి.
News February 19, 2026
శ్రీకాకుళం IIITలో వేధింపులపై విచారణ

ఎచ్చెర్లలో ఉన్న శ్రీకాకుళం ఐఐఐటీ క్యాంపస్ సిబ్బంది విద్యార్థులను వేధిస్తున్నట్లు గతంలో వచ్చిన ఫిర్యాదుకు అంతర్గత కమిటీ విచారణ చేపట్టింది. బుధవారం ఇంజినీరింగ్ విద్యార్థులను, సిబ్బందిని వేర్వేరుగా విచారణ చేశారు. నూజివీడు క్యాంపస్కు చెందిన 6 మంది సభ్యుల కమిటీ విచారణ చేపట్టి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది.
News February 19, 2026
ఉమ్మడి NZB జిల్లాలో చికెన్ ధర ఎలా ఉందంటే?

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చికెన్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ మొదలవ్వడంతో కొనుగోళ్లు ఎక్కువయ్యాయి. కేజీలలో లైవ్ కోడి రూ.150 కాగా విత్ స్కిన్ రూ.200, స్కిన్ లెస్ రూ.220, బోన్ లెస్ రూ.240, చికెన్ లివర్ రూ. 170. మటన్ కేజీ రూ.700 నుంచి 900 వరకు అమ్మకాలు కొనసాగుతున్నాయి. మాంసం ప్రియులు ఇటు చికెన్తో పాటు అటు మటన్ కొనుగోలు చేస్తున్నారు.


