News April 29, 2024

నీళ్లు, విద్యుత్ కొరత.. ఓయూలో హాస్టళ్లు, మెస్సులు బంద్

image

TG: ఉస్మానియా యూనివర్సిటీలోని హాస్టళ్లు, మెస్సులకు అధికారులు వేసవి సెలవులు ప్రకటించారు. వీటిని మే 1 నుంచి మే 31వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు తెలిపారు. అలాగే వర్సిటీలో నీళ్లు, విద్యుత్ కొరత ఉందని పేర్కొన్నారు. విద్యార్థులంతా సహకరించాలని కోరుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా వర్సిటీ హాస్టళ్లలో నీటి కొరతపై ఇటీవల విద్యార్థులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే.

Similar News

News December 27, 2025

ప్రాజెక్టులపై అసెంబ్లీలో PPT ప్రజెంటేషన్!

image

TG: ఈనెల 29 నుంచి ఆరంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సాగనున్నాయి. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులపై అధికార, విపక్షాల మధ్య హోరాహోరీ చర్చ జరిగే అవకాశముంది. PPT ప్రజెంటేషన్ ద్వారా దీటుగా జవాబిచ్చేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సిద్ధమవుతున్నారు. అదే తరహాలో తానూ PPTతో ప్రశ్నించడానికి BRS నేత హరీశ్ రెడీ అవుతున్నారు. ఒకవేళ తనను అందుకు అనుమతించకపోతే సభ వెలుపల PPT ప్రదర్శించాలని యోచిస్తున్నారు.

News December 27, 2025

చలి ఎక్కువగా అనిపిస్తోందా? ఇవి కూడా కారణం కావొచ్చు

image

కొందరికి చలి ఎక్కువగా అనిపించడం అనేది శరీరంలోని వివిధ సమస్యలను సూచిస్తుందంటున్నారు నిపుణులు. శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా పనిచేయనప్పుడు చలి ఎక్కువగా అనిపిస్తుంది. ఎక్కువసేపు కూర్చోవడం, శారీరక శ్రమ లేని వారు ఈ కోవకు చెందుతారు. అలాగే విటమిన్ B12, విటమిన్ D లోపం ఉన్నవారిలో కూడా చలి ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. వీరు పాలకూర, బీట్‌రూట్, గుడ్లు, చేపలు, చికెన్ పాలు, పెరుగు తినాలని సూచిస్తున్నారు.

News December 27, 2025

బంగ్లాదేశ్ కోసం ధర్మయుద్ధం చేశాం: ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్

image

1971లో బంగ్లాలో పాక్ సైన్యం చేసిన అరాచకాలను చూస్తూ ఉండలేకపోయిన భారత్ ‘ధర్మయుద్ధం’ చేసిందని ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్ గుర్తుచేశారు. పాక్ ఎప్పుడూ అధర్మాన్నే నమ్ముకుందని.. మనం మాత్రం శత్రువులకు కూడా గౌరవం ఇచ్చామన్నారు. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోకపోతే కచ్చితంగా తగిన సమయంలో అది బుద్ధి చెబుతుందని పరోక్షంగా బంగ్లాను హెచ్చరించారు.