News February 6, 2026
మందస: వాసుదేవుని బ్రహ్మోత్సవాలు.. కార్యక్రమాలు ఇవే

మందస శ్రీ వాసుదేవ్ పెరుమాళ్ ఆలయంలో శనివారం నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్న విషయం తెలిసిందే. బ్రహ్మోత్సవాలలో భాగంగా కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి. 7న ఆంజనేయస్వామి అభిషేకం, 8న వాసుదేవుని అభిషేకం, 9న శేషవహనసేవ, 10న కల్పవృక్ష వాహనం, ఎదుర్కోలు ఉత్సవం, 11న స్వామివారి కళ్యాణం, 12న తెప్పోత్సవం, అస్వవాహనసేవ, 13న చక్రస్నానం, రథోత్సవం, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
Similar News
News February 24, 2026
శ్రీకాకుళం: బంగారం చోరీ చేసిన విద్యార్థులు

శ్రీకాకుళంలోని ఎల్బీఎస్ కాలనీకి చెందిన ఓ ఉద్యోగి ఇంట్లో సోమవారం చోరీ జరిగింది. నగరంలో ఓ కార్పొరేట్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఇంట్లో చొరబడి 2తులాల బంగారం, రూ. 4వేలు ఎత్తుకెళ్లారు. బాధితుడు పోలీసులకు ఆశ్రయించగా వన్ టౌన్ సీఐ పైడాపునాయుడు వారిని పట్టుకున్నారు. విద్యార్థులు మైనర్లు కావడంతో తల్లితండ్రులు అభ్యర్థన మేరకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.
News February 24, 2026
శ్రీకాకుళంలో ప్రభలిన డయేరియా

శ్రీకాకుళం పట్టణంలోని మేదరవీది, గోల్కొండ రేవు రోడ్డు పరిసర ప్రాంతాలలో నివాసం ఉంటున్న పలువురు డయోరియా కారణంగా అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. ప్రైవేటు, ప్రజా వైద్య శాలలో ఆదివారం రాత్రి నుంచి బాధితులు చికిత్స పొందుతున్నారు. సుమారు 25 మంది వరకూ బాధితులు చికిత్స పొందుతున్నారు. ఈ ప్రాంతంలో పారిశుద్ధ్య సమస్యగా ఉందని స్థానికులు అంటున్నారు.
News February 23, 2026
SKLM: డయేరియా గ్రామాల్లో పర్యటించిన కలెక్టర్

శ్రీకాకుళం నగర పరిధిలో ప్రబలిన ధైర్య ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ దినకర్ పుండ్కర్ సోమవారం పర్యటించారు. కాకివీధి, గుడివీధి, దమ్మలవీధి, మంగువారి తోట గ్రామాల్లో డయేరియా ప్రబలి పలువురు అస్వస్థకు గురయ్యారు. నీరు కాచి చల్లార్చి తాగాలని, నిల్వ ఉన్న ఆహార పదార్థాలు తినరాదని సూచనలు చేశారు. ఆయా గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తామని 2,3 రోజులు ఇంట్లో నిలువ ఉన్న నీరు వాడకూడదన్నారు.


