News February 6, 2026
50ఏళ్ల తర్వాత మహిళలు ఇవి తినాలి

ఆడవారిలో 50 సంవత్సరాలు దాటాక హార్మోనల్ చేంజెస్ వస్తాయి. దీంతో శక్తి తగ్గడం, జాయింట్ పెయిన్స్, కండరాలు దృఢంగా మారడం, మానసిక సమస్యలొస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే రోజూవారీ ఆహారంలో నువ్వులు, అవిసెగింజలు, బాదం పప్పులు తప్పకుండా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటితో పాటు ఎక్కువగా నీరు తాగడంతో పాటు చిన్న చిన్న వ్యాయామాలు చెయ్యడం మంచిదంటున్నారు.
Similar News
News February 20, 2026
అజ్ఞాతంలోకి YCP ఎమ్మెల్సీ అనంతబాబు!

AP: YCP MLC అనంతబాబు భార్య లక్ష్మీదుర్గపై సిట్ ఛార్జ్షీట్ దాఖలు చేయడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. గన్మెన్లు, వ్యక్తిగత సిబ్బంది లేకుండా ఇవాళ శాసనమండలి సమావేశాల నుంచి ఆయన అర్ధాంతరంగా వెళ్లిపోయినట్లు సమాచారం. ఇప్పటికే అనంతబాబు భార్య కోసం పోలీసుల గాలిస్తున్నారు. తమ మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యలో భర్తను ప్రేరేపించడమే కాకుండా అన్ని విధాలా ఆమె సహకరించారని సిట్ పేర్కొంది.
News February 20, 2026
జుట్టు జిడ్డు ఇలా తగ్గిద్దాం..

కాలుష్యం, దుమ్మూ తోడై కొందరి జుట్టు త్వరగా జిడ్డుగా మారుతుంది. దానికోసం ఈ చిట్కాలు.. * షాంపూలో స్పూన్ కలబంద, కాస్త నిమ్మరసం చేర్చి బాగా కలిపి తలకు పెట్టుకోవాలి. ఈ మిశ్రమంతో వారానికి రెండుసార్లు తలస్నానం చేయాలి. * రెండు స్పూన్ల ముల్తానీమట్టికి తగినంత నీరు కలిపి తలకు పట్టించాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. * తలస్నానం చేసిన జుట్టుకు బ్లాక్ టీని పట్టించి ఇరవైనిమిషాల తర్వాత కడిగేయాలి.
News February 20, 2026
జప మాలను మెడలో ధరించవచ్చా?

జపానికి వాడే మాలను మెడలో ధరించకూడదని పండితులు సూచిస్తున్నారు. కేవలం జపం కోసమే ప్రత్యేకంగా ఉంచాలని చెబుతున్నారు. జపమాలకు సంబంధించి కొన్ని నియమాలు.. భగవంతుని శక్తిని జాగృతం చేసే జపంలో ఏకాగ్రత ముఖ్యం. జపమాల 108 పూసలతో ఉండటం ఉత్తమం. 54, 27 లేదా 9 పూసలున్న మాలలను కూడా వాడొచ్చు. రుద్రాక్ష, తులసి వంటి పదార్థాలు మంత్ర శక్తిని శరీరంలోకి చేరవేసే వాహకాలుగా పనిచేస్తాయి.


