News February 6, 2026
HYD: రవీంద్ర భారతిలో స్వరాల విందు

HYD నగరంలోని సంగీత ప్రియులకు అద్భుత అవకాశం. ‘ఉత్తర దక్షిణ్’ 15వ సీజన్ శాస్త్రీయ సంగీత వేడుక ఫిబ్రవరి 14న సాయంత్రం 6:30 గంటలకు రవీంద్ర భారతిలో జరగనుంది. హిందుస్తానీ గాత్ర విద్వాంసుడు జయతీర్థ్ మేవుండి, ప్రముఖ కర్ణాటక సంగీత వేణుగాన కళాకారుడు శశాంక్ సుబ్రహ్మణ్యంల అపురూప జుగల్బందీ శ్రోతలను అలరించనుంది. ఎస్బీఐ సౌజన్యంతో నిర్వహించే ఈ కార్యక్రమ టికెట్లు ‘బుక్ మై షో’లో లభ్యం కానున్నాయి.
Similar News
News February 15, 2026
హస్తం జోరు.. ఇక GHMC ఎన్నికలేనా?

మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ సత్తాచాటడంతో జోష్లో ఉంది. ఇదే ఊపులో GHMC ఎన్నికలు నిర్వహించేందుకు సర్కారు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 3 కార్పొరేషన్లుగా ఏర్పాటు కావటంతో పలు విషయాలను పరిగణనలోకి తీసుకుని రిజర్వేషన్లను ఖరారు చేసే పనిలో పడింది. మే నెల చివరి కల్లా పాలకమండలి కొలువుదీరేలాగా సర్కార్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. శివారు మున్సిపాలిటీల్లో హస్తానికి మిశ్రమ ఫలితాలొచ్చాయి.
News February 15, 2026
HYD: ఈ శివాలయానికి వెయ్యేళ్ల చరిత్ర..!

శివారులోని శంకర్పల్లి మం. చందిప్పలో 1000 ఏళ్ల క్రితం నాటి మహిమగల బ్రహ్మసూత్ర మరకత శివాలయం ఉంది. సోమేశ్వర లింగాన్ని దర్శిస్తే వ్యాధులు పోతాయని అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. ఆలయ ప్రాంగణంలో వెలసిన కాలభైరవుడు గుడిని వెయ్యి కళ్లతో రక్షిస్తాడని చెబుతారు. HYD నుంచి శంకర్పల్లి 40 కిలోమీటర్లు. మెహదీపట్నం, పటాన్చెరు నుంచి ఇక్కడికి బస్సు సౌకర్యం ఉంది. శంకర్పల్లి నుంచి ఆటోలు ఉంటాయి.
News February 15, 2026
HYD: కార్పొరేషన్లో ప్రతి సోమవారం ప్రజావాణి

నూతనంగా ఆవిర్భవించిన మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రతీ సోమవారం ప్రజావాణి నిర్వహించనున్నట్లు కమిషనర్లు వినయ్ కృష్ణారెడ్డి, సృజన స్పష్టంచేశారు. సోమవారం ఉ.10:30 గం. నుంచి మ. ఒంటి గంట వరకు తార్నాకలోని MMC ఆఫీస్లో మల్కాజిగిరి, మాదాపూర్లోని న్యాక్ బిల్డింగ్ సీఎంసీ ఆఫీస్లో సైబరాబాద్ ప్రజావాణి ఉంటుంది. అన్ని సర్కిల్, జోనల్ ఆఫీస్లలో అధికారులు పాల్గొనాలని ఆదేశాలు జారీ చేశారు.


