News April 29, 2024

కడప: వైసీపీలోకి కాంగ్రెస్ నేత నజీర్ అహ్మద్

image

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నజీర్ అహ్మద్ ఆ పార్టీని వీడారు. వైఎస్ షర్మిల వచ్చాక కాంగ్రెస్ పార్టీలో తనకు జరిగిన అవమానాన్ని భరించలేక, మనస్తాపంతో కాంగ్రెస్ పార్టీని వీడి వైసీపీలో చేరానన్నారు. ఆయనకు అవినాశ్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి అంజాద్ బాషా, మేయర్ సురేశ్ బాబులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్‌లో ఉన్న తనను అవమానపరిచారని ఆరోపించారు.

Similar News

News March 2, 2026

కడప: గత నెలలో AMCల ఆదాయం ఎంతంటే.!

image

కడప జిల్లాలో 11 వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC)లు ఉన్నాయి. వీటిద్వారా గత నెలలో మార్కెట్ సెస్ రూపంలో రూ.1.55 కోట్లు ఆదాయం లభించింది.
AMCల వారీగా ఆదాయం రూ.లక్షల్లో ఇలా. కడప-18.95, ప్రొద్దుటూరు-20.35, బద్వేల్-29.77, జమ్మలమడుగు-16.64, పులివెందుల-15.48, రాజంపేట-2.80, మైదుకూరు-17.59, కమలాపురం-17.15, సిద్ధవటం-0.47, ఎర్రగుంట్ల-11.49, సింహాద్రిపురం-5.14 లక్షలు మార్కెట్ సెస్ రూపంలో వసూలైంది.

News March 2, 2026

కడప: ‘రూ.120.68 కోట్లు వసూలు’

image

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు కడప రీజనల్ పరిధిలో AMCల ద్వారా రూ.120.68 కోట్లు మార్కెట్ సెస్ లభించిందని కడప JDM రామాంజనేయులు తెలిపారు.
జిల్లాల వారీగా ఆదాయం రూ.కోట్లల్లో ఇలా.
కడప-11.78, అనంతపురం-10.65, చిత్తూరు-7.34, కర్నూల్-34.43,
నంద్యాల-23.33, తిరుపతి-20.54, అన్నమయ్య-8.34,
సత్యసాయి-4.24 కోట్లు లభించినట్లు తెలిపారు.
కాగా ఫిబ్రవరిలో రూ.19.14 కోట్లు వసూలైందన్నారు.

News March 2, 2026

కడప జిల్లాలో 34 సెంటర్లలో ఓపెన్ ఇంటర్ పరీక్షలు.!

image

కడప జిల్లాలో సోమవారం నుంచి 34 సెంటర్లలో ఓపెన్ ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. 5,884 మంది రెగ్యులర్, 619 మంది సప్లిమెంటరీ, మొత్తం 6,503 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. సోమవారం ఇంగ్లిష్ పరీక్షకు 5,424 మంది విద్యార్థులు హాజరయ్యారు. 635 మంది ఆబ్సెంట్ అయ్యారు. కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, బద్వేల్, మైదుకూరు, కమలాపురంలోని 34 ప్రభుత్వ హైస్కూళ్లలో ఓపెన్ ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.