News April 29, 2024
HYD: ఓయూ చీఫ్ వార్డెన్కు షోకాజ్ నోటీసు

ఉస్మానియా యూనివర్సిటీలో విద్యుత్, నీటి ఎద్దడి నెలకొన్నదని పేర్కొంటూ వేసవి సెలవులను ప్రకటిస్తూ చీఫ్ వార్డెన్ డాక్టర్ కొర్రెముల శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఇదీ ప్రభుత్వ తీరు అంటూ మాజీ CM KCR విమర్శలకు దిగారు. తాజా ఉత్తర్వులపై సమాధానం చెప్పాలంటూ చీఫ్ వార్డెన్కు వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ షోకాజ్ నోటీసు జారీ చేశారు.
Similar News
News November 5, 2025
KPHB: OYOలో పోలీసుల RAIDS

KPHBకాలనీలోని హోటళ్లలో అసాంఘిక కార్యక్రమాలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. తాజాగా రోడ్ నం.3లోని OYO హోటల్లో రైడ్స్ చేశారు. ఈ సోదాల్లో 6 కిలోల గంజాయి పట్టుబడింది. నిందితులు కాకినాడకు చెందిన జ్యోతి, అజయ్ (27), రమేశ్ (28)గా గుర్తించారు. APలో గంజాయి కొనుగోలు చేసి నగరంలో అధిక ధరకు విక్రయిస్తున్నారు. OYOలో రూమ్ అద్దెకు తీసుకొని మరీ వ్యాపారం మొదలుపెట్టినట్లు పోలీసులు గుర్తించారు.
News November 5, 2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: ఓటేసిన 97 మంది

జూబ్లీహిల్స్లో మంగళవారం హోం ఓటింగ్కు మంచి స్పందన వచ్చింది. 97 మంది వృద్ధులు, వికలాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హోం ఓటింగ్ కోసం మొత్తం 103 మంది దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు 95 శాతానికి పైగా ఓటింగ్ నమోదు కావడం విశేషం. పోలింగ్ సరళిని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ పరిశీలించారు. ఈ స్ఫూర్తితోనే నవంబర్ 11న కూడా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆశిద్దాం.
News November 5, 2025
HYD: కార్తీకపౌర్ణమి.. ఫేమస్ శివాలయాలు ఇవే!

కార్తీక పౌర్ణమి సందర్భంగా HYD-ఉమ్మడి రంగారెడ్డిలోని ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. కీసరగుట్టతో పాటు సిటీ శివారులో ప్రఖ్యాతి, అతి పురాతన ఆలయాలు ఉన్నాయి. ఆరుట్ల-బుగ్గ రామలింగేశ్వర స్వామి, యాచారం-నందీశ్వర, శంషాబాద్-సిద్ధేశ్వరాలయం, శంకర్పల్లి-మరకత శివలింగం, పాంబండ-రామలింగేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయి. పాంబండ దక్షిణాసియాలోనే అతిపెద్ద ఏకశిలా పర్వతంపైన ఉన్న ఆలయం. మీ ఏరియాలోని శివాలయం విశిష్టత ఏంటి?
SHARE IT


