News April 29, 2024
కృష్ణా జిల్లా సంగ్రామంలో 94 మంది అభ్యర్థులు
కృష్ణా జిల్లాలో నామినేషన్ల ఘట్టం ముగిసింది. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణల అనంతరం 94 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మచిలీపట్నం పార్లమెంట్కు 15 మంది పోటీలో నిలవగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 79 మంది పోటీలో నిలిచారు. గన్నవరం అసెంబ్లీకి 12, గుడివాడకు 12, పెడనకు 10, మచిలీపట్నంకు 10, అవనిగడ్డకు 12, పామర్రుకు 08, పెనమలూరుకు 11 మంది పోటీలో నిలిచారు.
Similar News
News September 30, 2024
విజయవాడ: శరన్నవరాత్రి ఉత్సవాలకు చంద్రబాబుకు ఆహ్వానం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరిగే కనకదుర్గమ్మ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలకు సీఎం చంద్రబాబును సోమవారం దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆహ్వానించారు. ఈ మేరకు ఉండవల్లిలోని సీఎం నివాసంలో దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, ఆలయ అధికారులు, మంత్రితో కలసి చంద్రబాబుకు అమ్మవారి ప్రసాదం, ఆహ్వానపత్రిక అందజేశారు.
News September 30, 2024
ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్ బాలాజీ
మచిలీపట్నంలోని జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ బాలాజీ ఆధ్వర్యంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లాకు చెందిన ముఖ్య అధికారులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. ప్రజల వద్ద నుంచి స్వీకరించిన సమస్యలకు నాణ్యమైన పరిష్కారం చూసినప్పుడే ప్రజలు సంతృప్తికరంగా ఉంటారన్నారు.
News September 30, 2024
సులభతరం కానున్న హైదరాబాద్-విజయవాడ బస్సు ప్రయాణం
తెలుగు రాష్ట్రాల్లో కీలక నగరాల మధ్య బస్సు ప్రయాణం సులభతరం వేగవంతం చేసేదిగా ఆర్టీసీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ మధ్య రాకపోకలకు సరికొత్త మార్గంపై దృష్టి సారించింది. ఔటర్ రింగ్ రోడ్ మీదగా బస్సులు నడిపించడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో సోమవారం నుంచి 2ఈ గరుడ బస్సుల్ని ఓఆర్ఆర్ మీదగా నడిపించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. తద్వారా ప్రయాణికులకు 1.15 గంటల సమయం కలిసి రానుంది.