News February 7, 2026

‘తులం బంగారం, కళ్యాణ లక్ష్మి’ ఊసేలేదు: హరీశ్

image

TG: పెన్షన్ల పెంపు, మహాలక్ష్మి పథకం అమలు చేయకుండా సీఎం రేవంత్ ప్రజలను మోసం చేశారని BRS MLA హరీశ్ రావు విమర్శించారు. తులం బంగారం, కళ్యాణ లక్ష్మి చెక్కుల ఊసే లేదన్నారు. గజ్వేల్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ‘రేవంత్ వచ్చాక ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. కేసీఆర్ ఇచ్చిన అన్ని స్కీములను ఆయన రద్దు చేశారు. ఇక కమలం గుర్తుకు ఓటేయడం అంటే మోరీలో వేయడమే’ అని ఫైరయ్యారు.

Similar News

News April 18, 2026

రాత్రి 8.30 గంటలకు మోదీ ప్రసంగం.. ఏం చెప్పనున్నారు?

image

ప్రధాని మోదీ ఈరోజు రాత్రి 8.30 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల కోసం తెచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోవడంపై మాట్లాడే అవకాశం ఉంది.

News April 18, 2026

హార్ముజ్‌ను మళ్లీ మూసేసిన ఇరాన్

image

హార్ముజ్ జలసంధి ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఇరాన్ షాకిచ్చింది. తమ ఓడరేవుల నుంచి రాకపోకలు సాగించే నౌకలను US అడ్డుకోవడంపై మండిపడింది. ఇది ఆగేవరకు తమ నియంత్రణ కొనసాగుతుందని మిలిటరీ కమాండ్ ఓ ప్రకటన విడుదల చేసింది. అమెరికా తన హామీలను విస్మరించిందని ఫైరయ్యింది.

News April 18, 2026

GOOD NEWS: చిన్నారి పునర్వికకు పునర్జన్మ

image

స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనే అరుదైన వ్యాధితో పోరాడుతున్న చిన్నారి పునర్విక ప్రాణాలు నిలిచాయి. <<19232308>>దాతల<<>> ద్వారా సేకరించిన ₹10కోట్లు, ప్రభుత్వం తరఫున మరో ₹6కోట్లు వెచ్చించి అత్యంత ఖరీదైన ఇంజెక్షన్‌ను ఇవాళ అందించారు. ‘ఇచ్చిన <<19240414>>మాట<<>> నిలబెట్టుకున్నాం. చిట్టి తల్లి నూరేళ్లు వర్ధిల్లు’ అని పునర్వికతో ఉన్న ఫొటోలను మంత్రి లోకేశ్ షేర్ చేశారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన మానవత్వంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.