News April 30, 2024

జహీరాబాద్‌లో నియోజకవర్గంలో మహిళలే అధికం

image

జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. ప్రస్తుతం విడుదలైన తుది జాబితా ప్రకారం మొత్తం 16,40,755 మంది ఓటర్లు ఉన్నారు. 2014 నుంచి 2019 వరకు 53వేల ఓటర్లు మాత్రమే పెరిగారు. 2019 నుంచి 24 మధ్య 1,45,912 మంది పెరిగినట్లు అధికారుల వెల్లడించారు. పెరిగిన ఓటర్లలో మహిళల సంఖ్యే అధికంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

Similar News

News January 31, 2026

NZB: అందుబాటులోకి మన ఇసుక వాహనం బుకింగ్ యాప్: కలెక్టర్

image

ఇసుక అక్రమ రవాణాను అరికట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్తగా ప్రవేశపెట్టిన మన ఇసుక వాహనం ఆన్‌లైన్ బుకింగ్ యాప్ విధానాన్ని NZB జిల్లాలో అందుబాటులోకి తెచ్చామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మ్యానువల్ విధానానికి స్వస్తి పలుకుతూ పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో ఇసుక బుకింగ్ చేసుకునేలా ప్రయోగత్మకంగా జిల్లాలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు. ఆన్‌లైన్‌లోనే UPI పేమెంట్ చేయాలని సూచించారు.

News January 31, 2026

TU: ముగిసిన బీఎడ్, బీపీ ఎడ్ పరీక్షలు

image

తెలంగాణ విశ్వ విద్యాలయ పరిధిలో B.Ed, B.Ped (1వ, 3వ సెమిస్టర్) పరీక్షలు శనివారం ప్రశాంతంగా ముగిశాయని ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంట చంద్రశేఖర్ తెలిపారు. మధ్యాహ్నం జరిగిన బీఎడ్, బీపీఎడ్ పరీక్షలకు 1,339 మంది విద్యార్థులకు 1,302 మంది హాజరయ్యారన్నారు. 37 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు.

News January 31, 2026

NZB: వారం రోజుల్లో 84 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు: సీపీ

image

నిజమాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో గడిచిన వారం రోజుల్లో 84 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు. ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలో చేపట్టిన వాహన తనిఖీల్లో 84 కేసులు నమోదు కాగా వారిని సంబంధిత కోర్టుల్లో హాజరుపరిచారు.ఇందులో మొత్తం రూ. 7,90,000 జరిమానా విధించగా ఐదుగురికి వారం రోజుల జైలు శిక్షను కోర్టు విధించినట్లు వివరించారు.