News February 7, 2026

జనగామ: రెండో విడత ఇంటర్ ప్రాక్టికల్స్‌లో 97 మంది గైర్హాజరు

image

జనగామ జిల్లాలోని 10 పరీక్ష కేంద్రాల్లో శనివారం జరిగిన ఇంటర్మీడియట్ రెండో విడత ప్రాక్టికల్ పరీక్షలకు 97 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని డీఐఈవో జితేందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 64 మంది, మధ్యాహ్నం 33 మంది గైర్హాజరు అయ్యారని వెల్లడించారు. జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు శ్రీనివాస్, శేఖర్, జనగామ జిల్లా కేంద్రంలోని పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసినట్లు చెప్పారు.

Similar News

News February 15, 2026

రేపు ప్రజావాణి రద్దు: నిర్మల్ కలెక్టర్

image

నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల దృష్ట్యా ఈ వారం ప్రజావాణిని రద్దు చేశామన్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చే ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

News February 15, 2026

రాజన్న సన్నిధిలో క్షేత్రస్థాయిలో కలెక్టర్‌ పర్యవేక్షణ

image

మహాశివరాత్రి జాతర సందర్భంగా వేములవాడ పట్టణంలోని భీమేశ్వరాలయం భక్తులతో రద్దీగా మారింది. ఈ మేరకు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదివారం క్షేత్రస్థాయిలో పర్యటించి ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యూ లైన్ కౌంటర్లను పరిశీలించి, ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అని భక్తులను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు శీఘ్రంగా దర్శనమయ్యేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు.

News February 15, 2026

ఇమ్రాన్ ఖాన్ ప్రాణాలకు ముప్పు.. PTI ఆందోళన

image

అవినీతి కేసుల్లో జైలులో ఉన్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ <<19124142>>తీవ్ర అనారోగ్యంతో<<>> బాధపడుతున్నట్లు PTI పార్టీ తెలిపింది. దీంతో అధికారులు ఆయనను జైలు నుంచి రహస్యంగా ఆస్పత్రికి తరలిస్తున్నారని, ఇది ఇమ్రాన్ ప్రాణాలకు ముప్పు కలిగిస్తుందని ఆరోపించింది. ఆయన ఫ్యామిలీ మెంబర్, పర్సనల్ డాక్టర్ల సమక్షంలో పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేసింది. ఇమ్రాన్ ఆరోగ్యం గురించి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని కోరింది.