News April 30, 2024
మచిలీపట్నం స్వతంత్ర అభ్యర్థికి ‘గాజు గ్లాసు’ను పోలిన గుర్తు

మచిలీపట్నం అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి చింతపల్లి మనోహర్కు గాజు గ్లాసును పోలిన గుర్తును కేటాయించారు. నామినేషన్ల ఉపసంహరణల అనంతరం మచిలీపట్నం అసెంబ్లీ బరిలో 14 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారని రిటర్నింగ్ అధికారిణి వాణి తెలిపారు. వీరిలో ప్రధాన పార్టీల అభ్యర్థులకు వారి వారి పార్టీ సింబల్స్ కేటాయించామన్నారు. ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులకు కూడా సింబల్స్ కేటాయించామని చెప్పారు.
Similar News
News September 11, 2025
కృష్ణా: ఒకేసారి 15 మందికి గవర్నమెంట్ జాబ్స్

కోడూరు మండలం జరుగువానిపాలెం గ్రామం ఆదర్శంగా నిలిచింది. చిన్న పల్లెటూరు నుంచి ఒకేసారి 15 మంది విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వారిలో 8 మంది అమ్మాయిలు, 7 మంది అబ్బాయిలు. ఇటీవల విడుదలైన డీఎస్సీ, పోలీస్ రిక్రూట్మెంట్లో వీరు అర్హత సాధించారు. 11 టీచర్ పోస్టులు, 3 పోలీస్ ఉద్యోగాలు, ఒకరు సేల్స్ ట్యాక్స్లో నియామకం పొందారు.
News September 11, 2025
గరికపాడులో జిల్లా జూడో జట్ల ఎంపిక

తోట్లవల్లూరు మండలం గరికపాడు ప్రభుత్వ పాఠశాలలో అండర్-14, 17 జూడో జట్ల ఎంపికలు ఘనంగా జరిగాయి. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ ఎంపికలు నిర్వహించినట్లు జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య కార్యదర్శులు దుర్గారావు, శ్రీలత తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు కీర్తి తీసుకురావాలని వారు క్రీడాకారులను కోరారు.
News September 11, 2025
మచిలీపట్నం-విజయవాడ రహదారిపై ప్రమాదం.. స్పాట్ డెడ్

మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారిపై గురువారం ప్రమాదం జరిగింది. కారు, బైక్ ఢీకొనడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని వెంటనే 108 అంబులెన్స్లో మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.