News February 8, 2026

కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన సూర్య కుమార్

image

T20Iల్లో సూర్య కుమార్ యాదవ్ సరికొత్త రికార్డు నెలకొల్పారు. టీమ్ ఇండియా తరఫున అత్యధిక POTMలు నెగ్గిన ప్లేయర్‌గా నిలిచారు. నిన్నటి మ్యాచులో POTM రావడంతో ఆయన ఖాతాలో అవార్డుల సంఖ్య 17కు చేరింది. ఆ తర్వాతి స్థానాల్లో విరాట్ కోహ్లీ(16), రోహిత్ శర్మ(14), అక్షర్ పటేల్(8) ఉన్నారు. T20I WCలో భారత్ తరఫున అత్యధిక POTMలు గెలిచిన జాబితాలో కోహ్లీ(8), సూర్య(4), యువరాజ్(3), అశ్విన్(3), రోహిత్(3) ఉన్నారు.

Similar News

News February 18, 2026

స్నాక్స్ లాగించేస్తున్నారా?

image

దాదాపు 76% మంది భారతీయులకు రోజుకు రెండుసార్లైనా స్నాక్స్ తినే అలవాటు ఉంది. బిస్కెట్స్, చిప్స్, షుగరీ ఫుడ్స్, డ్రింక్స్ వంటివి తీసుకోవడం వల్ల జీవక్రియపై ఒత్తిడి పడుతుంది. డయాబెటిస్ రిస్క్ పెరిగి, ఆయుష్షుపైన ప్రభావం పడుతుంది. భారతీయుల జీవనశైలికి ప్రొటీన్, ఫైబర్, సరిపడా కార్బ్స్ ఉండే బ్యాలెన్స్‌డ్ మీల్స్ రోజులో 2-3 సార్లు తీసుకుంటే సరిపోతుందని.. స్నాక్స్ అవసరం లేదని వైద్యులు సూచిస్తున్నారు.

News February 18, 2026

భర్త పర్మిషన్ లేకుండా బంధువుల ఇంటికెళ్తే 3 నెలల జైలు శిక్ష!

image

అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల సుప్రీం లీడర్ హిబతుల్లా అఖుంద్‌జాదా సరికొత్త క్రిమినల్ కోడ్‌ ఇటీవల అమల్లోకి తెచ్చారు. దీని ప్రకారం భర్త అనుమతి లేకుండా బంధువుల ఇంటికి వెళ్తే మహిళలకు 3 నెలల జైలు శిక్ష పడుతుంది. అలాగే భార్యలు, పిల్లలను భౌతికంగా శిక్షించే అధికారం భర్తలు, తండ్రులకు ఉంటుంది. అయితే, ఎముకలు విరగొద్దు. చర్మంపై ఏమాత్రం గాట్లు పడొద్దు. ఒకవేళ గాయాలైనట్లు ఆధారం ఉంటే మహిళ కోర్టును ఆశ్రయించొచ్చు.

News February 18, 2026

78ఏళ్ల వయసులో గోల్డ్ మెడల్

image

ఇండోర్‌కు చెందిన సుష్మా మౌఘే మరాఠీ సాహిత్యంలో మాస్టర్స్ చేసి గోల్డ్ మెడల్ అందుకున్నారు. గత నలభై ఏళ్లుగా సంగీత ఉపాధ్యాయురాలిగా చేసిన ఆమె కెమిస్ట్రీలో M.Sc కూడా చేశారు. అనేక పుస్తకాలు రచించడంతో పాటు హిందీ పుస్తకాలను మరాఠీలోకి అనువదించారు. 76ఏళ్ల వయసులో దేవి అహల్యా విశ్వవిద్యాలయంలో M.Aలో చేరి తాజాగా జరిగిన స్నాతకోత్సవంలో 78ఏళ్ల వయసులో గోల్డ్ మెడల్ అందుకొని ఎందరికో ఆదర్శంగా నిలిచారు.