News February 8, 2026

శివరాత్రి బ్రహ్మోత్సవాలకు జిల్లా కలెక్టర్, ఎస్పీకీ ఆహ్వానం

image

శ్రీశైలంలో ఆదివారం నుంచి ప్రారంభం కానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారిని దేవస్థానం అధికారులు ఆహ్వానించారు. శనివారం కలెక్టరేట్‌లో ఆమెను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. అలాగే జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్‌ను కలిసి బ్రహ్మోత్సవాల పత్రికతో పాటు మల్లన్న ప్రసాదాన్ని అందజేసి ఆహ్వానించారు.

Similar News

News April 18, 2026

కాళేశ్వరం బ్యారేజ్‌ల పరిశీలనకు 43 రోజుల గడువు

image

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌ల వైఫల్య కారణాల విశ్లేషణకు రాష్ట్ర ప్రభుత్వం 43 రోజుల గడువు నిర్ణయించింది. కల్నల్ పరీక్షిత్ మెహ్రా నేతృత్వంలో 9 మంది సభ్యులతో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసింది. మే 30లోగా పరీక్షలు పూర్తి చేసి పునరుద్ధరణ డిజైన్లు సిద్ధం చేయాలని ఆదేశించింది. పనుల పురోగతిపై ప్రతిరోజూ నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

News April 18, 2026

GNT: పెరుగుతున్న కులాంతర వివాహాలు

image

సమాజంలో కులాల అడ్డు గోడలు కూలుతున్నాయి. యువత ఆలోచనల్లో విశేష మార్పు వస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏటా 600కు పైగా కులాంతర పెళ్లిళ్లు జరుగుతున్నాయి. నగరాల్లో ఈ సంఖ్య పెరుగుతుండగా, పల్లెల్లో ఇంకా భయం నెలకొంది. ఈ పెళ్లిళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ యువత ముందున్నారు. వేర్వేరు కులాల మధ్య వివాహాలతో జన్యు వైవిధ్యం పెరిగి భావితరాలు ఆరోగ్యంగా ఉంటాయని సైన్స్ చెబుతోంది.

News April 18, 2026

పాడేరు: ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులకు గమనిక

image

ఇంటర్ పరీక్ష రాసిన విద్యార్థులు అవసరం అయితే రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం అప్లై చేసుకోవాలని ఉమ్మడి అల్లూరి జిల్లా ఇంటర్ విద్యాధికారి భీమశంకరరావు శనివారం తెలిపారు. రీ కౌంటింగ్‌కు ఒకొక్క పేపర్‌కు రూ. 260, రీ వెరిఫికేషన్‌కు రూ.1300 చొప్పున చెల్లించాలన్నారు. ఆన్లైన్లో మాత్రమే ఈ నెల 27లోగా అప్లై చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.