News February 8, 2026
ఇంటర్ ప్రాక్టికల్స్.. ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ!

ఏలూరు జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్స్ మంగళవారంతో ముగుస్తాయని RIO యోహాన్ ఆదివారం తెలిపారు. ఫిబ్రవరి 23 నుంచి 56 కేంద్రాల్లో థియరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. ఉదయం 8:30 గంటలకే కేంద్రంలోకి అనుమతి ఉంటుందని, ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను అనుమతించబోమని స్పష్టం చేశారు. శనివారం జరిగిన ప్రాక్టికల్స్కు 4,363 మంది హాజరవ్వగా, 169 మంది గైర్హాజరైనట్లు ఆయన వివరించారు.
Similar News
News February 21, 2026
గద్వాల: దివ్యాంగుల గ్రీవెన్స్ డేకు 37 దరఖాస్తులు

దివ్యాంగుల సమస్యలు పరిష్కరించేందుకు గద్వాల కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన గ్రీవెన్స్లో 37 దరఖాస్తులు వచ్చాయని అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు పేర్కొన్నారు. దివ్యాంగుల సంక్షేమం ప్రభుత్వ లక్ష్యమని, వారి సమస్యలు పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందన్నారు. ఇకపై ప్రతి నెలలో మూడో శనివారం దివ్యాంగుల గ్రీవెన్స్ డే నిర్వహిస్తామన్నారు. ఈ అవకాశాన్ని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News February 21, 2026
నేత్రాలు మానవ మనుగడకు జీవనాధారం: ధర్మచరణ్

అభయ ఛారిటబుల్ ట్రస్ట్ శనివారం ఉచిత కంటి, దంత వైద్యపరీక్షలు నిర్వహించింది. రెడ్డిపాలెంలోని వేదసీడ్స్ కార్యాలయంలో మెడెక్స్ హాస్పిటల్ సహకారంతో ఈ శిబిరం జరిగింది. డాక్టర్ పొట్లూరి అపర్ణ వైద్యబృందం కంటి, దంత పరీక్షలు చేసి పలు సూచనలు చేశారు. వేదసీడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తులసీ ధర్మచరణ్ మాట్లాడుతూ.. ఆరోగ్యకరమైన నేత్రాలే మానవాళి మనుగడకు జీవనాధారం అని అన్నారు.
News February 21, 2026
రెండో పెళ్లి చేసుకున్న శిఖర్ ధవన్

టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్ రెండో వివాహం చేసుకున్నారు. ఐర్లాండ్కు చెందిన ప్రేయసి సోఫీ షైన్తో ఇవాళ ఏడడుగులు వేశారు. ఈ జంటకు అభిమానులు, తోటి క్రికెటర్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఢిల్లీలో జరిగిన ఈ వేడుకకు బంధువులు, స్నేహితులు హాజరయ్యారు. పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.


