News February 8, 2026

‘దోస్తో’ యాప్‌ ద్వారానే యూరియా విక్రయాలు: డీఏఓ

image

జిల్లాలో యూరియా అమ్మకాలు ఇకపై యాప్ ద్వారానే సాగాలని డీఏఓ అజయ్ కుమార్ తెలిపారు. అక్రమ విక్రయాలను అరికట్టేందుకు ప్రభుత్వం ‘దోస్తో’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చిందన్నారు. రైతులు ఎరువుల కోసం ఇబ్బంది పడకుండా దుకాణదారులు నిరంతరం స్టాక్ వివరాలను అప్డేట్ చేయాలన్నారు. మండల స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి రైతులకు తోడ్పాటు అందించాలని ఒక ప్రకటనలో కోరారు.

Similar News

News February 22, 2026

భద్రాచలం: రేపు ఐటీడీఏ కార్యాలయంలో గిరిజన దర్బార్

image

భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న గిరిజన దర్బార్ కార్యక్రమానికి అన్ని శాఖల ఐటీడీఏ యూనిట్ అధికారులు సకాలంలో హాజరుకావాలని ఐటీడీఏ పీవో రాహుల్ ఆదివారం తెలిపారు. గిరిజనులు వారి వారి సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదును అందచేయాలని కోరారు. గిరిజన దర్బార్‌కు రేపు ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.

News February 22, 2026

తిరుపతి జిల్లా ప్రజలకు గమనిక

image

సోమవారం తిరుపతి కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించనున్నారు. కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ ప్రజల నుంచి పలు సమస్యలపై అర్జీలు స్వీకరించనన్నారు. ఇప్పటికే అర్జీలు ఇచ్చి సమస్య పరిష్కారం కాకపోయిన వారు లేదా తమ ఫిర్యాదుల స్థితి తెలుసుకోవాలనుకునే వారు 1100 నంబర్‌కు కాల్ చేయవచ్చన్నారు. అలాగే అర్జీలను Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చన్నారు.

News February 22, 2026

VZM: బిల్లులు ఎప్పుడు?

image

విజయనగరం జిల్లాలో పెండింగ్‌ గృహ బిల్లుల సమస్యపై లబ్ధిదారుల్లో అసంతృప్తి పెరుగుతోంది. గతంలో మంజూరైన ఇళ్లకు చెల్లింపులు జరగక అనేక నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. 2024లో సర్వే నిర్వహించి 24,000 ఇళ్లు అసంపూర్తిగా ఉన్నట్లు గుర్తించారు. వీటికి సుమారు రూ.19 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. బిల్లులు విడుదలైతే ఇళ్లను పూర్తిచేసుకునేందుకు లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు.