News February 8, 2026
ఆలయాలకు గోపురం ఎందుకు ఉంటుంది?

గోపురం ఆధ్యాత్మిక, శాస్త్రీయ, సామాజిక అవసరాల సమాహారం. ఆగమ శాస్త్రం ప్రకారం ఇది దేవుని పాదాలకు సంకేతం. గుడిపై ఈ నిర్మాణం విశ్వశక్తిని గ్రహిస్తుంది. గుడికి శక్తి కేంద్రంగా నిలుస్తుంది. దేవుడే సర్వోన్నతుడని చాటుతుంది. ఎత్తుగా ఉండి బాటసారులకు దిక్సూచిగా మార్గం చూపుతుంది. పిడుగుల నుంచి రక్షణ కవచంగా పనిచేస్తుంది. దూరం నుంచి గోపురాన్ని దర్శించినా దైవకృప లభిస్తుందని నమ్మకం. మన సంస్కృతికిది నిలువుటద్దం.
Similar News
News March 1, 2026
త్వరలోనే 10గ్రాముల బంగారం రూ.2లక్షలు?

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలపై పెను ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర ₹1,70,000 <<19269997>>మార్కును<<>> దాటింది. ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగి, ఇరు దేశాల మధ్య దాడులు తీవ్రమైతే అతి త్వరలోనే ఇది ₹2,00,000 మార్కును చేరుకోవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారం, వెండిని ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించడమే ఇందుకు కారణం.
News March 1, 2026
ఖమేనీ అంతం… US తదుపరి అడుగులు ఏమిటి

ఇరాన్ ‘సుప్రీం’ ఖమేనీని అంతం చేసిన US అక్కడి ప్రభుత్వ మార్పుపై ఏం చేయబోతుందనేది ఆసక్తిగా మారుతోంది. ఇరాక్లో సద్దాం అంతం అనంతరం ప్రజా ప్రభుత్వం ఏర్పాటైనా US అండతోనే పాలన సాగింది. వెనిజులాలో అధ్యక్షుడు మదురోను అరెస్టు చేసినా అక్కడి ప్రభుత్వాన్నే కొనసాగించింది. అయితే ఇరాన్లో అలా సాధ్యం కాదని, భిన్నమైన వ్యూహంతో వెళ్లొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. అంతర్గత కలహాలతో GOVT కూలిపోవచ్చంటున్నారు.
News March 1, 2026
పోకో, రెడ్మీ ఫోన్ల ధరలూ పెరిగాయి

ఇప్పటికే వివో, iQOO, శాంసంగ్ సంస్థలు <<19253401>>ఫోన్<<>> ధరలు పెంచేయగా.. ఈ లిస్ట్లో ఇప్పుడు మరో రెండు బ్రాండ్లు చేరాయి. పోకో తన C75, M7, C85, M7 ప్లస్, F7 మోడళ్లలోని వివిధ వేరియంట్లపై ₹1000-₹2500 వరకు ధరలు పెంచింది. ఇకపై పోకోలో బేస్ మోడల్ ఫోన్ ధర ₹10,999గా ఉండనుంది. ఈ హైక్ ఈరోజే అమలులోకి రానుంది. రెడ్మీ సైతం ఇదే స్థాయిలో పెంచినట్లు సమాచారం. మెమొరీ చిప్ల కొరతతో కంపెనీలు ధరలు పెంచాల్సి వస్తోంది.


