News February 8, 2026
స్థానికేతరులు జిల్లాలో ఉండవద్దు: నిర్మల్ ఎస్పీ

ప్రచార సమయం 9వ తేదీ సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. ప్రచార సమయం ముగిశాక అభ్యర్థులు లేదా వారి మద్దతుదారులు ఎవరూ కూడా ప్రచారం నిర్వహించరాదని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించి ప్రచారం నిర్వహిస్తే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, కేసులు నమోదైతే అభ్యర్థిత్వం కూడా కోల్పోయే అవకాశముందని హెచ్చరించారు. స్థానికేతరులు ఎవరూ జిల్లాలో ఉండవద్దని హెచ్చరించారు.
Similar News
News February 21, 2026
NZB: వారినే కొనసాగిస్తారా?.. కొత్త వారికి అవకాశం ఇస్తారా?

నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రకటన నేపథ్యంలో NZB జిల్లా నుంచి రాష్ట్ర ఛైర్మన్లుగా ప్రస్తుతం ఉన్న వారినే కొనసాగిస్తారా? లేక కొత్త వారికి అవకాశమిస్తారా? అన్న చర్చ జరుగుతోంది. జిల్లా నుంచి ఈరవత్రి అనిల్ కుమార్ – మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, మానాల మోహన్ రెడ్డి – సహకార యూనియన్, అన్వేష్ రెడ్డి – విత్తనాభివృద్ధి సంస్థ, తాహేర్ బిన్ హమ్దాన్ – ఉర్దూ అకాడమీకి రాష్ట్ర ఛైర్మన్లుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
News February 21, 2026
ఖమ్మం రెవెన్యూ శాఖలో 15 మందికి పదోన్నతులు

ఖమ్మంలో రెవెన్యూ శాఖలో పదోన్నతులు పొందిన 15 మందికి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి నియామక పత్రాలు శుక్రవారం అందజేశారు. జవాబుదారీతనంతో పనిచేసి ప్రజలకు పారదర్శక సేవలు అందించాలని సూచించారు. డ్రాఫ్టింగ్, కంప్యూటర్ వినియోగంపై పట్టు సాధించాలని దిశానిర్దేశం చేశారు. ట్రెసా ప్రతినిధులు కలెక్టర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఒకేసారి 15 మందికి పదోన్నతులు రావడంతో శాఖలో ఉత్సాహం నెలకొంది.
News February 21, 2026
రోడ్డు ప్రమాదంలో నెల్లూరు యువకుడి దుర్మరణం

తిరుపతి జిల్లా చంద్రగిరి ఫ్లైఓవర్పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు దుర్మరణం చెందాడు. ఒక గుర్తు తెలియని వాహనం బైక్ను బలంగా ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని నెల్లూరు పొదలకూరు రోడ్డు నేతాజీనగర్కు చెందిన రోషన్ కుమార్ (25)గా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.


