News April 30, 2024

నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థులు వీరే..

image

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(BRS), మల్లు రవి (కాంగ్రెస్), భరత్ ప్రసాద్(BJP), బీసమోళ్ల యూసఫ్(BSP), అమరనాథ్(ఇండియా ప్రజాబంధు పార్టీ), అయ్యప్ప సునీల్(రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్), అంబోజు రవి(డెమోక్రటిక్ రిఫార్మ్), విజయ్(బహు జన్ ముక్తి పార్టీ), దాసరి భారతి(విదుతలై చిరుతైగల్ కచ్చి), ప్రాసంగి (పిరమిడ్ పార్టీ), విజయ్(విద్యార్థుల రాజకీయ పార్టీ), స్వతంత్రులు కర్నె శిరీష(బర్రెలక్క)తో పాటు 8 మంది బరిలో ఉన్నారు.

Similar News

News March 12, 2026

రాజాపూర్: రోడ్డు ప్రమాదంలో చెన్నవెళ్లి యువకుడు మృతి

image

రాజాపూర్ మండల పరిధిలోని చెన్నవెళ్లికి చెందిన చిలివేరి నరేశ్ గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. నరేశ్ రాజాపూర్ నుంచి షాద్‌నగర్ వైపు వెళ్తుండగా అతని బైక్, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో నరేశ్ అక్కడికక్కడే మృతి చెందారు. షాద్‌నగర్ సమీపంలోని ఓ పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్న నరేశ్ మృతి పట్ల చెన్నవెల్లిలో విషాదఛాయలు అలముకొన్నాయి.

News March 11, 2026

MBNR : పదో తరగతి పరీక్షలు.. ఫోన్ వాడితే ఉద్యోగం ఊస్ట్!

image

మహబూబ్‌నగర్ జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ అధికారులు కఠిన ఆదేశాలు జారీ చేశారు. పరీక్షా కేంద్రాల్లోకి ఎవరినీ మొబైల్ ఫోన్లతో అనుమతించకూడదని స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా నిబంధనలు అతిక్రమించి ఫోన్ వాడుతూ పట్టుబడితే, వారిని వెంటనే ఉద్యోగం నుంచి తొలగిస్తామని అధికారులు హెచ్చరించారు.

News March 11, 2026

దేవరకద్రలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

image

మహబూబ్ నగర్ జిల్లాలో జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేవరకద్రలో అత్యధికంగా 38.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గండీడు (36.0), భూత్పూర్ (35.7), కోయిలకొండ (35.6) మండలాల్లోనూ ఎండ ప్రభావం అధికంగా ఉంది. చిన్నచింతకుంట, అడ్డాకుల, నవాబుపేట ప్రాంతాల్లో 34 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మార్చిలోనే ఎండలు ముదురుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.