News April 30, 2024

ఇచ్ఛాపురంలో పిడుగుపాటుకు ఐదుగురికి గాయాలు

image

పట్టణంలో సోమవారం పిడుగులతో కూడిన చిరుజల్లులు కురిశాయి. బహుదానదీ తీరంలో ఒడిశా గ్రామం వద్ద ఇటుకల పరశ్రమలో పనిచేసే కార్మికులు , తమ గుడిసెల్లో ఉండగా పిడుగు పడడంతో ఐదుగురు గాయపడ్డారు.కుటుంబీకులు ఇచ్ఛాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.

Similar News

News March 4, 2026

శ్రీకాకుళం: పిల్లలు పుట్టలేదని వివాహిత ఆత్మహత్య

image

అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో వివాహిత సాయి తేజ(23) ఆత్మహత్యకు పాల్పడినట్లు సీఐ నర్సింగరావు మంగళవారం తెలిపారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరుకు చెందిన తేజ పిల్లలు పుట్టలేదని మనస్తాపంతో సోమవారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకుందన్నారు. అనకాపల్లి ప్రభుత్వాసుపత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు.

News March 4, 2026

SKLM: పారిశుద్ధ్యం పనులను పరిశీలించిన జేసీ

image

శ్రీకాకుళం నగరంలో డయేరియా నేపథ్యంలో పారిశుద్ధ్య పనులను జిల్లా యంత్రాంగం ముమ్మరం చేసింది. జాయింట్ కలెక్టర్, ఇన్‌ఛార్జి నగరపాలక సంస్థ, ఇన్‌ఛార్జి కమిషనర్ అహ్మద్ ఫర్మాన్ ఖాన్ మంగళవారం పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. సెవెన్ రోడ్డు జంక్షన్‌లో ఉన్న అన్న క్యాంటీన్‌ను సందర్శించారు. అనంతరం కాజీపేటలో జరిగిన పారిశుద్ధ్యం పనులను పర్యవేక్షించారు.

News March 3, 2026

జర్మనీ వెళ్తూ దోహా ఎయిర్‌పోర్టులో చిక్కుకున్న సిక్కోలు వాసి

image

శ్రీకాకుళం మండలం సింగుపురానికి చెందిన పుట్రేవు వెంకట సత్య గౌతమ్ ఖతర్‌లోని దోహా ఎయిర్ పోర్టులో చిక్కుకున్నాడు. ఇతను బెంగళూరులోని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నానని, కంపెనీ ఆదేశాల మేరకు జర్మనీ ఫ్లైట్లో వెళ్తుండగా యుద్ధం వాతావరణం నెలకొనడంతో దోహా ఎయిర్ పోర్టులో విమానాన్ని నిలిపివేశారు. దీంతో ఎటు వెళ్లలేని పరిస్థితి నెలకొందని ఆయన కుటుంబీకులకు తెలిపాడు.