News April 30, 2024

ప్రకాశం: ముగిసిన డిగ్రీ రెండో సెమిస్టర్ పరీక్షలు

image

ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయం పరిధిలోని ఉమ్మడి ప్రకాశం జిల్లాలో డిగ్రీ రెండో సెమిస్టర్ పరీక్షలు సోమవారంతో ముగిశాయి. ఈనెల 22వ తేదీన 88 డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొత్తం 38 పరీక్ష కేంద్రాల్లో సజావుగా సాగాయని యూనివర్సిటీ అదనపు పరీక్షల నియంత్రణ అధికారి పద్మజ తెలిపారు. ఈ పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లుగా తెలిపారు.

Similar News

News March 10, 2026

మిస్సింగ్ కేసుల చేదనకు ప్రత్యేక దృష్టి సారించాలి: ప్రకాశం SP

image

మిస్సింగ్ కేసులు, NBW, మహిళలకు సంబంధించిన కేసులు, రోడ్డు ప్రమాదాల నివారణ, అలాగే స్వర్ణాంధ్ర విజన్‌కి పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ వంటి అంశాలపై సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై అధికారులను అరా తీశారు. మిస్సింగ్ కేసుల చేధనకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, చిన్నారులు, మహిళల అదృశ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

News March 10, 2026

మిస్సింగ్ కేసుల చేదనకు ప్రత్యేక దృష్టి సారించాలి: ప్రకాశం SP

image

మిస్సింగ్ కేసులు, NBW, మహిళలకు సంబంధించిన కేసులు, రోడ్డు ప్రమాదాల నివారణ, అలాగే స్వర్ణాంధ్ర విజన్‌కి పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ వంటి అంశాలపై సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై అధికారులను అరా తీశారు. మిస్సింగ్ కేసుల చేధనకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, చిన్నారులు, మహిళల అదృశ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

News March 9, 2026

ప్రకాశం: ఈతకు వెళ్లి ఇంజినీరింగ్ విద్యార్థి మృతి

image

ప్రకాశం జిల్లాకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డ ఘటన నరసరావుపేటలో జరిగింది. నరసరావుపేట (M) పెట్లూరువారిపాలెంలో స్థానిక ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న కొనకనమిట్ల (M) కాట్రగుంటకి చెందిన మల్లెల అజయ్(19) ఆదివారం NSP కాలువలో ఈతకు వెళ్లాడు. నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయాడు. కళాశాల వార్డెన్ ఫిర్యాదుతో నరసరావుపేట SI కిషోర్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.