News February 9, 2026
పిన్నెల్లి సోదరులపై అక్రమ కేసులు: రజిని

నెల్లూరు జైలులో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకట్రామిరెడ్డిలను మాజీ మంత్రి విడదల రజిని సోమవారం పరామర్శించారు. కూటమి ప్రభుత్వం రాజకీయ కక్షతోనే వారిపై అక్రమ కేసులు బనాయించి 61 రోజులుగా జైల్లో ఉంచిందని ఆమె విమర్శించారు. పోలీసులు ఐదుసార్లు బెయిల్ను అడ్డుకోవడం దారుణమని, వారు ఏ తప్పూ చేయలేదని రజిని స్పష్టం చేశారు. ఎంతటి వేధింపులకు గురిచేసినా భయపడకుండా న్యాయపోరాటం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
Similar News
News April 18, 2026
WGL: ఎమ్మెల్యేలకు వీడిన టెన్షన్!

పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లు వీగిపోవడంతో ప్రస్తుత MLAలు ఊపిరి పీల్చుకున్నారు. ఉమ్మడి జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాలకు తోడుగా మరో 6-7 నియోజకవర్గాలు కొత్తగా వస్తాయని, ఇప్పుడున్న రిజర్వేషన్లు మారుతాయని ప్రచారం జరిగింది. కొందరు నాయకులు ఈ MLA మనకు ఉండరనే ఉద్దేశంతో మరో నేత దగ్గరకు వెళ్లిన వారున్నారు.కాగా ప్రస్తుత రిజర్వేషన్లే మళ్లీ ఉండటంతో తిరిగి MLAల దగ్గరకే రావాల్సిన పరిస్థితి లీడర్లకు ఏర్పడింది.
News April 18, 2026
‘మే’లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు?

తెలంగాణలో మరోసారి ఎన్నికల సందడి మొదలు కానుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్స్ కోసం ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని అధికారులను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ నెల 23లోపు ముసాయిదా జాబితా సిద్ధం చేసి అనంతరం విడుదల చేయనుంది. దీంతో వచ్చే నెలలో ఎలక్షన్స్ జరిగే అవకాశం కనిపిస్తోంది. కాగా గతేడాది జూన్తో ఎంపీటీసీ, జడ్పీటీసీల పదవీకాలం ముగిసింది. ఇక రాష్ట్రంలో ఇటీవల సర్పంచ్ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.
News April 18, 2026
సంబేపల్లెలో గురుకుల విద్యార్థిని మృతి

సంబేపల్లె మండలం ఎర్రగుంట్లలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల కళాశాలలో చదువుతున్న రెడ్డిరాణి 14 (9వ తరగతి) విద్యార్థి శనివారం తెల్లవారుజామున మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. విద్యార్థినికి శ్వాస పీల్చుకోవడం కష్టంగా ఉండడంతో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో మృతి చెందినట్లు సమాచారం. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


