News February 9, 2026

ఎర్రగుంట్ల: కన్న తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కొడుకు

image

ఎర్రగుంట్ల(M) పోట్లదుర్తిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జాకోబ్(60) తన తల్లి సుందరమ్మ(90)పై ఆదివారం పెట్రోల్ పోసి నిప్పంటించాడు. బంధువులు వెంటనే ఆమెను ప్రొద్దుటూరుకు, ఆపై RIMSకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందింది. దీనిపై కేసు నమోదు చేసినట్లు CI విశ్వనాథరెడ్డి తెలిపారు. జాకోబ్ తన కూతురు లత వద్ద రూ.18 లక్షలు తీసుకున్నాడు. ఈ అప్పును తీర్చమన్నందుకే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు CI చెప్పారు.

Similar News

News February 10, 2026

SO..SAD కడప: మనుమడి బర్త్ డేకి వచ్చి మృతి.!

image

కడపలో సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎస్పీబంగ్లా నుంచి ఆర్టీసీ బస్టాండ్ వెళ్లే మార్గంలో జిల్లాని కోర్టు సమీపంలో ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న వ్యక్తి ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి రాయచోటికి చెందిన నాగేశ్వరరావుగా గుర్తించారు. తన మనుమడి పుట్టినరోజుకు కడపకు రాగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం.

News February 9, 2026

కడప జిల్లాలో పలువురు సీఐలు బదిలీ

image

కడప జిల్లాలో పలువురు సీఐలను బదిలీ చేస్తూ కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
☛ నంద్యాల ఫ్యాక్షన్ జోన్‌కు ప్రొద్దుటూరు ఫ్యాక్షన్ జోన్ సీఐ రియాజ్ అహ్మద్ బదిలీ
☛ గోవిందరెడ్డి కడప VR నుంచి ప్రొద్దుటూరు ఫ్యాక్షన్ జోన్ బదిలీ
☛ దస్తగిరి కడప VR నుంచి అన్నమయ్య ఎస్సీ, ఎస్టీ సెల్‌కు బదిలీ
☛ లింగప్ప బద్వేల్ నుంచి మన్నూరుకు బదిలీ
☛ రామకృష్ణ సత్యసాయి జిల్లా నుంచి బద్వేల్‌కు బదిలీ.

News February 9, 2026

ఆర్థిక అక్షరాస్యత పై విస్తృతంగా అవగాహన కల్పించండి: కలెక్టర్

image

భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు నిర్వహిస్తున్న ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలపై ప్రజల్లో ఆర్థిక అవగాహన పెంచేందుకు కృషి చేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలకు సంబంధించి పోస్టర్‌ను ఎస్పీ నచికేత్ విశ్వనాథ్‌తో కలసి ఆవిష్కరించారు. సురక్షిత బ్యాంకింగ్ విధానాలు, డిజిటల్ లావాదేవీలపై అప్రమత్తంగా ఉండాలన్నారు.