News April 30, 2024
పతంజలికి GST షోకాజ్ నోటీసులు

యోగా గురువు బాబా రాందేవ్ ఆయుర్వేదిక్ సంస్థ పతంజలి ఫుడ్స్కి GST అధికారులు షోకాజ్ నోటీసులు పంపించారు. రూ.27.46కోట్ల GST బకాయిలు పేరుకుపోయాయని అందులో పేర్కొన్నారు. దానిపై పెనాల్టీ ఎందుకు వసూలు చేయకూడదో వివరించాలని కంపెనీ ప్రశ్నించారు. కాగా ఇటీవల ఆ కంపెనీ తప్పుడు ప్రకటనలు చేస్తోందని సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో సదరు సంస్థ బహిరంగ క్షమాపణ చెప్పింది.
Similar News
News March 11, 2026
జాగ్రత్త.. లేపేస్తాం: ట్రంప్కు ఇరాన్ వార్నింగ్

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచాయి. హార్ముజ్ జలసంధిలో చమురు రవాణాను అడ్డుకుంటే ఇరాన్ను మరింత బలంగా దెబ్బతీస్తామని ట్రంప్ హెచ్చరించగా.. దీనిపై ఇరాన్ భద్రతా మండలి చీఫ్ అలీ లారిజానీ ఘాటుగా స్పందించారు. ‘మీకంటే గొప్పవారే ఇరాన్ను ఏమీ చేయలేకపోయారు. జాగ్రత్త.. లేదంటే మీరే లేకుండాపోతారు’ అని ట్రంప్ను హెచ్చరించారు.
News March 11, 2026
కొడుకును వారసుడిగా తిరస్కరించిన ఖమేనీ?

తన కుమారుడు మొజ్తబా వారసుడు కావడం దివంగత ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీకి ఇష్టం లేదట. ఈ మేరకు వీలునామాలో స్పష్టంగా పేర్కొన్నట్లు న్యూయార్క్ పోస్ట్ రాసుకొచ్చింది. అయినా IRGC బలవంతంగా మొజ్తబా పేరును ప్రతిపాదించి కొత్త సుప్రీం లీడర్గా ఎన్నుకునేలా చేసినట్లు తెలుస్తోంది. కుటుంబ పాలనను వ్యతిరేకించిన అలీ ఖమేనీ నిర్ణయానికి భిన్నంగా సైన్యం ముందుకు వెళ్లడం ఇప్పుడు ఇరాన్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
News March 11, 2026
60 ఏళ్లలో 100 రెట్లు పెరిగిన సిలిండర్ ధర!

దేశంలో డొమెస్టిక్ LPG సిలిండర్ ధరలు 60 ఏళ్లలో భారీగా పెరిగాయి. 1960లో కేవలం ₹7 నుంచి ₹10 మధ్య ఉన్న ధర 2026 నాటికి ఢిల్లీలో ₹913కు చేరుకుంది. 1990లో ₹120, 2010లో ₹400గా ఉన్న ధర నేడు సామాన్యుడిపై పెను భారంగా మారింది. అంతర్జాతీయ ఇంధన ధరల మార్పులు, మారుతున్న సబ్సిడీ విధానాలు & ద్రవ్యోల్బణం కారణంగానే ఈ పెరుగుదల కనిపిస్తోంది. గడిచిన ఆరు దశాబ్దాలలో సిలిండర్ ధర దాదాపు వంద రెట్లు పెరగడం గమనార్హం.


